భీమ్లా నాయక్ వాయిదా పడిపోయింది కదా.. ఇంకేముంది బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసినట్లే అని అక్కినేని అభిమానులు సంబరపడిపోయారు. జనవరి 15న బంగార్రాజు రిలీజ్ అంటూ జోరుగా ప్రచారం జరిగిపోతోంది. కానీ బంగార్రాజు టీం నుంచి మాత్రం సౌండ్ లేదు. లాంఛనమే అనుకున్న రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఐతే తాపీగా ఇంకొన్ని రోజుల తర్వాత విడుదల తేదీ ప్రకటించే స్కోప్ ఏమాత్రం లేదు.
సంక్రాంతికి పోటీ మామూలుగా ఉండట్లేదు. ఓవైపు ఆర్ఆర్ఆర్, ఇంకోవైపు రాధేశ్యామ్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజవుతున్నాయి. వాటికి పోను ఏమాత్రం థియేటర్లు మిగులుతాయన్నది సందేహమే. మరీ తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే బంగార్రాజుకు ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ సినిమా సంక్రాంతికే వస్తుందంటూ తన రెగ్యులర్ బయ్యర్లకు నాగ్ ఇంతకుముందే హామీ ఇచ్చి థియేటర్లు బుక్ చేసుకోమని చెప్పాడట.
కానీ అంత ఈజీగా అయితే స్క్రీన్లయితే దొరుకుతున్న పరిస్థితి లేదట. అసలు సినిమా ఇంకా పూర్తి కాకుండా, రిలీజ్ పక్కా అని తేలకుండా థియేటర్లు బుక్ చేయడం సమస్యగా ఉంది. ఇన్ని రోజులు అసలు భీమ్లా నాయక్ కూడా రేసులో ఉండటంతో థియేటర్ల బుకింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పుడా సినిమా రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. బంగార్రాజు విషయంలో అధికారిక ప్రకటన రాకుండా థియేటర్ల బుకింగ్ కష్టమవుతోంది.
నాగ్ చూస్తే షూటింగ్ అవ్వనీ, ఫస్ట్ కాపీ రానీ.. సోగ్గాడే చిన్నినాయనాకు చేసినట్లే కరెక్షన్లు అవీ చేసుకుని పక్కాగా సినిమాను రెడీ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ దానికి దొరికినంత సమయం దీనికి లభించేలా లేదు. సంక్రాంతికి వస్తే బాగుంటుందని హడావుడి పడి ఔట్ పుట్ బాగా లేని సినిమాను రిలీజ్ చేస్తే అసలుకే మోసం రావచ్చు. సినిమా బాలేకుంటే రెండు భారీ చిత్రాల మధ్య నలిగిగిపోతుంది. ఈ నేపథ్యంలో నాగ్ సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకుని బంగార్రాజు రిలీజ్ విషయంలో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు
This post was last modified on December 23, 2021 2:20 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…