రవితేజ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఎంతోమందికి ఫేవరేట్. జక్కన్న టేకింగ్.. డ్యూయెల్ రోల్లో మాస్ మహారాజా యాక్టింగ్ ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశాయి. దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందనే కోరిక చాలామందిలో ఉంది. వారి ఆశ ఇప్పుడు నెరవేరబోతోంది. విక్రమార్కుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే తెలుగులో కాదు.. హిందీలో.
తెలుగులో సక్సెస్ అయిన సినిమాలన్నింటినీ హిందీలోకి రీమేక్ చేసే బాలీవుడ్ వారు విక్రమార్కుడు చిత్రాన్నీ పట్టుకుపోయారు. అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ప్రెస్టీజియస్గా తీశారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్షయ్ కెరీర్లో భారీ హిట్ కొట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల కన్ఫర్మ్ చేశారు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో విక్రమార్కుడు సీక్వెల్కి సంబంధించిన టాపిక్ వచ్చింది. దాంతో సీక్వెల్కి స్టోరీ రెడీ చేస్తున్నట్లు చెప్పారు విజయేంద్ర ప్రసాద్. స్టోరీ రెడీ చేయమని సంజయ్ లీలా భన్సాలీ తనను సంప్రదించారని, తాను ఓకే అన్నానని, స్క్రిప్ట్ కూడా పూర్తి కావచ్చిందని ఆయన చెప్పారు. ఫస్ట్ పార్ట్లో నటించిన అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాల జోడీయే మళ్లీ నటిస్తుందట. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. వచ్చే యేడు ప్రారంభంలోనే మూవీ సెట్స్కి వెళ్లే చాన్స్ ఉంది.
ఈ సినిమాకి సీక్వెల్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులు కూడా చాలామందే ఉన్నారు. పలుమార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. దీనిపై ఇండస్ట్రీలో చర్చలు కూడా జరిగాయి. అయితే రాజమౌళి మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్లాన్ ఏదీ చేయలేదు. హిందీలో వచ్చేస్తోంది కాబట్టి బహుశా ఇక తెలుగులో వచ్చే చాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి రీమేక్స్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి.
This post was last modified on December 22, 2021 7:00 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…