Movie News

విక్రమార్కుడు సీక్వెల్‌ రెడీ

రవితేజ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఎంతోమందికి ఫేవరేట్. జక్కన్న టేకింగ్.. డ్యూయెల్‌ రోల్‌లో మాస్ మహారాజా యాక్టింగ్‌ ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశాయి. దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందనే కోరిక చాలామందిలో ఉంది. వారి ఆశ ఇప్పుడు నెరవేరబోతోంది. విక్రమార్కుడు సీక్వెల్‌ రెడీ అవుతోంది. అయితే తెలుగులో కాదు.. హిందీలో.        

తెలుగులో సక్సెస్ అయిన సినిమాలన్నింటినీ హిందీలోకి రీమేక్ చేసే బాలీవుడ్ వారు విక్రమార్కుడు చిత్రాన్నీ పట్టుకుపోయారు. అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ప్రెస్టీజియస్‌గా తీశారు. అది కూడా బ్లాక్‌ బస్టర్ అయ్యింది. అక్షయ్ కెరీర్‌‌లో భారీ హిట్ కొట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల కన్‌ఫర్మ్ చేశారు.        

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో విక్రమార్కుడు సీక్వెల్‌కి సంబంధించిన టాపిక్ వచ్చింది. దాంతో సీక్వెల్‌కి స్టోరీ రెడీ చేస్తున్నట్లు చెప్పారు విజయేంద్ర ప్రసాద్. స్టోరీ రెడీ చేయమని సంజయ్ లీలా భన్సాలీ తనను సంప్రదించారని, తాను ఓకే అన్నానని, స్క్రిప్ట్ కూడా పూర్తి కావచ్చిందని ఆయన చెప్పారు. ఫస్ట్ పార్ట్‌లో నటించిన అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాల జోడీయే మళ్లీ నటిస్తుందట. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. వచ్చే యేడు ప్రారంభంలోనే  మూవీ సెట్స్‌కి వెళ్లే చాన్స్ ఉంది.        

ఈ సినిమాకి సీక్వెల్‌ని కోరుకునే తెలుగు ప్రేక్షకులు కూడా చాలామందే ఉన్నారు. పలుమార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. దీనిపై ఇండస్ట్రీలో చర్చలు కూడా జరిగాయి. అయితే రాజమౌళి మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్లాన్ ఏదీ చేయలేదు. హిందీలో వచ్చేస్తోంది కాబట్టి బహుశా ఇక తెలుగులో వచ్చే చాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి రీమేక్స్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి. 

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

1 minute ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

2 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago