ఓవైపు ఆర్ఆర్ఆర్.. ఇంకోవైపు రాధేశ్యామ్.. ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చాలవన్నట్లు.. మరోవైపు భీమ్లా నాయక్.. ఇలాంటి మూడు భారీ చిత్రాలు సంక్రాంతికి ఖరారై ఉండగా.. అక్కినేని నాగార్జున సినిమా ‘బంగార్రాజు’కు చోటెక్కడుందో జనాలకు అర్థం కాలేదు. సంక్రాంతికి నూటికి నూరు శాతం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్న కాన్ఫిడెన్స్తో ఆయన కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలను రెగ్యులర్గా ఇచ్చే డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు చేసుకుని.. థియేటర్లు బుక్ చేసుకోమని చాలా ధీమాగా నాగ్ చెప్పడం పట్ల ఇండస్ట్రీ .జనాలు కూడా షాకయ్యారు. ఉన్న మూడు భారీ చిత్రాలకే థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియని స్థితిలో నాగ్ ఏ ధీమాతో తన సినిమాను రేసులో నిలుపుతున్నాడో అర్థం కాలేదు. తీరా చూస్తే నాగ్ కాన్ఫిడెన్సే గెలిచింది. ‘బంగార్రాజు’కు సంక్రాంతి పోటీలో చోటు దక్కింది. లేదు లేదంటూనే చివరికి ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించేశారు.
ఆ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడిపోయింది. సంక్రాంతికి వారం ముందు ఆర్ఆర్ఆర్, సంక్రాంతి రోజు రాధేశ్యామ్ రాబోతున్నట్లు దిల్ రాజు నేతృత్వంలోని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారిక ప్రకటన చేసింది. ప్రెస్ మీట్లో ‘బంగార్రాజు’ ఊసేమీ ఎత్తలేదు. కానీ ఆ చిత్రం రాధేశ్యామ్ రిలీజైన ఒక్క రోజు తర్వాత థియేటర్లలో దిగబోతున్న మాట వాస్తవం. నాగ్ తన పలుకుబడితో ఈ సినిమా రేంజికి తగ్గట్లు ఓ మోస్తరు థియేటర్లలో రిలీజ్కు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తమది సంక్రాంతికి పక్కాగా సరిపోయే ఫ్యామిలీ మూవీ కావడంతో టాక్ ఆధారంగా తర్వాత థియేటర్లు పెంచుకోవచ్చనే ధీమాతో నాగ్ ఉన్నాడు.
సినిమాకు లాంగ్ రన్ ఉంటుందనే ధీమా ఆయనలో ఉంది. సంక్రాంతి సమయంలో సినిమా చూడటం తెలుగు వారికి ఒక ఆనవాయితీ కావడంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల కోసం వచ్చే వాళ్లు వాటి టికెట్ల దొరక్కపోయినా తన సినిమా వైపు చూస్తారన్న కాన్ఫిడెన్స్తోనూ నాగ్ తన చిత్రాన్ని రేసులో నిలుపుతున్నాడు. ఆయన నమ్మకం నిలబడి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలోనే ‘బంగార్రాజు’ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on December 21, 2021 1:12 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…