హీరోల కొడుకులు హీరోలవడం సాధారణమే. కానీ హీరోల కూతుళ్లు హీరోయిన్లవడం అరుదే. చాలామంది సినీ రంగంలోకి వచ్చినా.. వేరే విభాగాల వైపు వెళ్తుంటారు. కానీ రాజశేఖర్ కూతుళ్లు మాత్రం ఇద్దరూ నటన వైపే అడుగులు వేశారు.
కానీ ఈ ఇద్దరికీ అంతగా కలిసి రావడం లేదిక్కడ. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ‘2 స్టేట్స్’ రీమేక్తో కథానాయికగా పరిచయం కావాల్సింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘అద్భుతం’ అని సినిమా చేస్తే అది చాలా ఆలస్యంగా.. ఈ మధ్యే ఓటీటీలో రిలీజైంది.
దానికి స్పందన అంతంతమాత్రమే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’కు కూడా అంతగా బజ్ రాలేదు. దాన్ని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తొలి చిత్రం ‘దొరసాని’ డిజాస్టర్ కావడం తెలిసిందే. మరో సినిమా ‘రంగమార్తాండ’ ఎంతకీ విడుదల కావట్లేదు. ఇదీ టాలీవుడ్లో ఈ ఇద్దరు వారసురాళ్ల పరిస్థితి.
ఐతే తెలుగులో కెరీర్ అంతంతమాత్రంగా ఉండగా.. వీళ్లిద్దరికీ తమిళంలో అవకాశాలు రావడం విశేషం. వీళ్లిద్దరూ నటించిన చిత్రాలు రెండు వారాల వ్యవధిలో తమిళనాట విడుదలవుతున్నాయి. శివాత్మిక తమిళంలో కథానాయికగా పరిచయం కానున్న ‘ఆనందం విలయాడుం వీడు’ ఈ నెల 24న థియేటర్లలోకి దిగబోతోంది.
ఇందులో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరో. ఇది పక్కా గ్రామీణ వాతావరణంలో నడిచే అరవ మార్కు మాస్ మూవీ. ఇందులో శివాత్మిక పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈ సినిమా ప్రోమోలైతే బాగానే అనిపిస్తున్నాయి. మరోవైపు శివాని తమిళంలో ‘అన్బరివు’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ హీరో.
అతను ఇప్పటికే హీరోగా నటించిన సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ కొత్త చిత్రంలో అతను ద్విపాత్రాభినయం చేస్తుండగా.. శివాని మోడర్న్ అమ్మాయిగా పొట్టి డ్రెస్సుల్లో సెక్సీగా కనిపిస్తోంది. ఈ చిత్రం జనవరి 7న హాట్ స్టార్ ద్వారా రిలీజవుతోంది. శివాని మూడో చిత్రం కూడా ఓటీటీ బాటే పట్టడం విశేషం. మరి తెలుగులో ఆకట్టుకోలేకపోయిన రాజశేఖర్ కూతుళ్లు తమిళంలో అయినా తమదైన ముద్ర వేస్తారేమో చూడాలి.
This post was last modified on December 21, 2021 9:37 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…