ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ పక్క సినిమాలతో పాటు ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ అనే షోని హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. బాలయ్య లాంటి అగ్ర హీరో తన హోస్టింగ్ స్కిల్స్ తో షో రేంజ్ ని పెంచేశారు.
ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, రాజమౌళి ఇలా పేరున్న తారలను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.
త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ షోలో కనిపించబోతున్నారు. కానీ ఆ ఎపిసోడ్ ని సీజన్ లాస్ట్ లో టెలికాస్ట్ చేస్తారని సమాచారం.
ఇదిలా ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఈ షోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రాబోతున్నారట. గతంలో రవితేజ, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. రవితేజ మెగా కాంపౌండ్ మనిషని.. అందుకే బాలయ్యతో విభేదాలు ఉన్నాయని రకరకాలుగా ప్రచారం జరిగేది.
దానికి తగ్గట్లే.. వీరిద్దరూ కూడా ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. ఇప్పుడు ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టనున్నారు బాలయ్య. రవితేజతో కలిసి ఒకే వేదికపై కనిపించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అది కూడా ‘అన్ స్టాపబుల్’ షోలో కావడం విశేషం. ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడాలి మరి!
This post was last modified on December 18, 2021 2:54 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…