ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ పక్క సినిమాలతో పాటు ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ అనే షోని హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. బాలయ్య లాంటి అగ్ర హీరో తన హోస్టింగ్ స్కిల్స్ తో షో రేంజ్ ని పెంచేశారు.
ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, రాజమౌళి ఇలా పేరున్న తారలను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.
త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ షోలో కనిపించబోతున్నారు. కానీ ఆ ఎపిసోడ్ ని సీజన్ లాస్ట్ లో టెలికాస్ట్ చేస్తారని సమాచారం.
ఇదిలా ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఈ షోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రాబోతున్నారట. గతంలో రవితేజ, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. రవితేజ మెగా కాంపౌండ్ మనిషని.. అందుకే బాలయ్యతో విభేదాలు ఉన్నాయని రకరకాలుగా ప్రచారం జరిగేది.
దానికి తగ్గట్లే.. వీరిద్దరూ కూడా ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. ఇప్పుడు ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టనున్నారు బాలయ్య. రవితేజతో కలిసి ఒకే వేదికపై కనిపించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అది కూడా ‘అన్ స్టాపబుల్’ షోలో కావడం విశేషం. ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడాలి మరి!
This post was last modified on December 18, 2021 2:54 pm
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…