టాలీవుడ్ లో పూజాహెగ్డే, రష్మిక స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. ఇద్దరూ కూడా టాప్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. కానీ రష్మికతో పోలిస్తే పూజాహెగ్డే క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. యూత్ లో పూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది.
రష్మిక ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. పూజాహెగ్డేకి రావాల్సిన కొన్ని బ్రాండ్స్ ని రష్మిక కొట్టేస్తుందని సమాచారం. మన తారలు సినిమాల్లో నటించడంతో పాటు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ.. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు.
రీసెంట్ గానే రష్మిక లాట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. నిజానికి ముందుగా ఈ ఆఫర్ పూజాహెగ్డే దగ్గరకు వెళ్లిందట. ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. రష్మిక రూ.50 లక్షలకే చేస్తానని ఆఫర్ చేయడంతో ఆ బ్రాండ్ రష్మిక చేతులోకి వచ్చిందట.
ఇప్పుడు పూజాని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్న కొన్ని కంపెనీలు రష్మిక తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకుంటుందని తెలుసుకొని.. ముందుగా ఆమె దగ్గరకు వెళ్తున్నారట. ఆ విధంగా పూజాకి వెళ్లాల్సిన బ్రాండ్స్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
This post was last modified on December 18, 2021 12:41 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…