టాలీవుడ్ లో పూజాహెగ్డే, రష్మిక స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. ఇద్దరూ కూడా టాప్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. కానీ రష్మికతో పోలిస్తే పూజాహెగ్డే క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. యూత్ లో పూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది.
రష్మిక ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. పూజాహెగ్డేకి రావాల్సిన కొన్ని బ్రాండ్స్ ని రష్మిక కొట్టేస్తుందని సమాచారం. మన తారలు సినిమాల్లో నటించడంతో పాటు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ.. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు.
రీసెంట్ గానే రష్మిక లాట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. నిజానికి ముందుగా ఈ ఆఫర్ పూజాహెగ్డే దగ్గరకు వెళ్లిందట. ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. రష్మిక రూ.50 లక్షలకే చేస్తానని ఆఫర్ చేయడంతో ఆ బ్రాండ్ రష్మిక చేతులోకి వచ్చిందట.
ఇప్పుడు పూజాని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్న కొన్ని కంపెనీలు రష్మిక తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకుంటుందని తెలుసుకొని.. ముందుగా ఆమె దగ్గరకు వెళ్తున్నారట. ఆ విధంగా పూజాకి వెళ్లాల్సిన బ్రాండ్స్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
This post was last modified on December 18, 2021 12:41 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…