టాలీవుడ్ లో పూజాహెగ్డే, రష్మిక స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. ఇద్దరూ కూడా టాప్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. కానీ రష్మికతో పోలిస్తే పూజాహెగ్డే క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. యూత్ లో పూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది.
రష్మిక ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. పూజాహెగ్డేకి రావాల్సిన కొన్ని బ్రాండ్స్ ని రష్మిక కొట్టేస్తుందని సమాచారం. మన తారలు సినిమాల్లో నటించడంతో పాటు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ.. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు.
రీసెంట్ గానే రష్మిక లాట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. నిజానికి ముందుగా ఈ ఆఫర్ పూజాహెగ్డే దగ్గరకు వెళ్లిందట. ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. రష్మిక రూ.50 లక్షలకే చేస్తానని ఆఫర్ చేయడంతో ఆ బ్రాండ్ రష్మిక చేతులోకి వచ్చిందట.
ఇప్పుడు పూజాని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్న కొన్ని కంపెనీలు రష్మిక తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకుంటుందని తెలుసుకొని.. ముందుగా ఆమె దగ్గరకు వెళ్తున్నారట. ఆ విధంగా పూజాకి వెళ్లాల్సిన బ్రాండ్స్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…