టాలీవుడ్ లో పూజాహెగ్డే, రష్మిక స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. ఇద్దరూ కూడా టాప్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. కానీ రష్మికతో పోలిస్తే పూజాహెగ్డే క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. యూత్ లో పూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది.
రష్మిక ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. పూజాహెగ్డేకి రావాల్సిన కొన్ని బ్రాండ్స్ ని రష్మిక కొట్టేస్తుందని సమాచారం. మన తారలు సినిమాల్లో నటించడంతో పాటు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ.. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు.
రీసెంట్ గానే రష్మిక లాట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. నిజానికి ముందుగా ఈ ఆఫర్ పూజాహెగ్డే దగ్గరకు వెళ్లిందట. ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. రష్మిక రూ.50 లక్షలకే చేస్తానని ఆఫర్ చేయడంతో ఆ బ్రాండ్ రష్మిక చేతులోకి వచ్చిందట.
ఇప్పుడు పూజాని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్న కొన్ని కంపెనీలు రష్మిక తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకుంటుందని తెలుసుకొని.. ముందుగా ఆమె దగ్గరకు వెళ్తున్నారట. ఆ విధంగా పూజాకి వెళ్లాల్సిన బ్రాండ్స్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
This post was last modified on December 18, 2021 12:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…