Movie News

‘పుష్ప’ సినిమాటోగ్రాఫర్‌‌తో సుకుమార్ ఫైట్

సుకుమార్ సినిమాల్లో చాలా వాటికి ఛాయాగ్రహణం అందించింది రత్నవేలు. వాళ్లిద్దరికీ ఎంత బాగా సింక్ అవుతుందో తెలిసిందే. తన ప్రతి సినిమాకూ దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీతం చేయించుకునే సుకుమార్.. చాలా వరకు ఛాయాగ్రహణ బాధ్యతలు రత్నవేలుకే అప్పగిస్తుంటాడు.

ఐతే ‘పుష్ప’ మొదలయ్యే సమయానికి ‘ఇండియన్’ సినిమాకు కమిటై ఉండటంతో రత్నవేలు ఈ చిత్రానికి పని చేయలేకపోయాడు. దీంతో అప్పటికే ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన పోలెండ్ సినిమాటోగ్రాఫర్ మిరస్లోవ్ కూబాను ఈ సినిమాకు తీసుకున్నాడు సుక్కు.

ఐతే ఈ సినిమా షూటింగ్ తొలి రోజుల్లో కూబాతో సుకుమార్‌కు పెద్ద గొడవే అయిందట. ‘పుష్ప’ రిలీజ్ ప్రెస్ మీట్లో స్వయంగా సుకుమారే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ కథేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నాకు ఇంగ్లిష్ సరిగా రాదు. కూబా పోలిష్ తప్ప వేరే భాష సరిగా మాట్లాడలేడు. అతడికి కూడా ఇంగ్లిష్ అంతగా రాదు. కానీ సినిమా ఎంత గొప్పదంటే.. ‘పుష్ప’ షూటింగ్ సందర్భంగా నేనేం చెబుతున్నానో తనకు అర్థమైపోయేది. తనేం మాట్లాడుతున్నాడో నేను అర్థం చేసుకోగలిగేవాడిని.

అంతలా మా ఇద్దరికీ సింక్ అయింది. కానీ ఇలా కావడానికి ముందు షూటింగ్ తొలి రోజుల్లో మా ఇద్దరికీ పెద్ద గొడవైంది. నేను ఒకసారి షూటింగ్‌లో ‘చేంజ్ ద లెన్స్’ అని చెప్పాను. దానికతను ‘సెన్స్ లెస్’ అన్నాడు. ఇంకోసారి ‘ఛేంజ్ ద లెన్స్’ అన్నా కూడా అతను ‘సెన్స్ లెస్’ అనే అన్నాడు. నేను హర్టయ్యాను.

ఒక దర్శకుడు లెన్స్ మార్చమంటే సెన్స్ లెస్ అనడమేంటి అనిపించింది. దీంతో కోపం వచ్చి అతడిని పిలిచి గట్టిగా అరిచాను. నేనంటే ఏమనుకుంటున్నావు.. నేనెలాంటి సినిమాలు తీశానో తెలుసా? నా సినిమాలసలు చూశావా అంటూ తిట్టేశాను. దానికతను కళ్లల్లో నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయాడు.

తర్వాత నేను పడుకుంటే డోర్ కొట్టి లోపలికి వచ్చి తాను అన్నట్లుగా ‘సెన్స్ లెస్’ అనే మాట ఎప్పుడూ అనలేదని చెప్పాడు. చేంజ్ లెన్స్ అనే మాటనే పోలిష్ యాసలో పలకడంతో అది ‘సెన్స్ లెస్’ అని అనిపించిందని నాకర్థమైంది. ఇక ఆ తర్వాత మా ఇద్దరికీ ఎలాంటి సమస్య రాలేదు. అప్పట్నుంచి ‘చేంజ్ ద లెన్స్’ అని కాకుండా ‘లెన్స్ చేంజ్’ అని అనుకోవడం మొదలుపెట్టాం’’ అంటూ సుకుమార్ నవ్వేశాడు.

This post was last modified on December 17, 2021 7:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago