రాజమౌళి ప్రతి సినిమాకూ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. కానీ ఆ అంచనాలను మించిపోయే సినిమాను అందించి ఆశ్చర్యపరుస్తుంటాడు జక్కన్న. కేవలం సినిమాలు అత్యద్భుతంగా తీయడమే కాదు.. వాటిని మార్కెట్ చేయడంలోనూ రాజమౌళి తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. సినిమా మేకింగ్ దశలో ఉండగానే ప్రమోషన్లు హోరెత్తిస్తుంటాడు. తన సినిమాలకు సంబంధించి బిజినెస్ డీల్స్ను కూడా రాజమౌళే దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాడని అంటారు.
బాహుబలి నిర్మాతలు కొత్త వాళ్లయినా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్యకు తెలుగు రాష్ట్రాల అవతల మార్కెట్పై పెద్దగా అవగాహన లేకపోయినా.. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ తెచ్చుకుందన్నా, భారీ డీల్స్ జరిగాయన్నా, ప్రమోషన్లు ఒక రేంజిలో జరుగుతున్నాయన్నా అందులో రాజమౌళి పాత్ర కీలకం అన్నది స్పష్టం.
ఇక ఒక బిజినెస్ డీల్ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వేసిన అడుగు.. ఈ సినిమాకు పెద్ద ప్లస్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఖరారవ్వగానే పీవీఆర్ సినిమాస్తో చిత్ర బృందం డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ ఛైన్తో ఒప్పందమేంటి.. ఎలాగూ ఏ సినిమా అయినా మిగతా మల్టీప్లెక్సుల్లో మాదిరే పీవీఆర్లోనూ రిలీజవుతుంది కదా.. దీనికి ప్రత్యేకంగా డీల్ ఏంటి అనుకున్నారు. కానీ దీని వెనుక రాజమౌళి స్ట్రాటజీ ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి సీజన్లో రాబోతుండటంతో దానికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే ఉంది.
రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలు పోటీకి సై అంటున్నాయి. తమిళంలో వలిమైతోనూ పోటీ తప్పదు. ఐతే దేశంలోనే అతి పెద్ద థియేట్రికల్ ఛైన్ ఉన్న పీవీఆర్తో ఆర్ఆర్ఆర్కు డీల్ ఉండటంతో పోటీలో ఏ సినిమాలున్నా.. రెండు మూడు వారాల పాటు ఆర్ఆర్ఆర్కే మేజర్ స్క్రీన్లు ఇస్తారు. వేరే చిత్రాల కోసం రాజీ పడే ఛాన్సే ఉండదు. ఇక రిలీజ్కు ముందు రెండు నెలల నుంచి పీవీఆర్లో ప్రతి షోలోనూ ఆర్ఆర్ఆర్ ప్రోమోలతో హోరెత్తించేస్తున్నారు. ఆ రకంగా ప్రమోషన్ గట్టిగా జరుగుతుంది. దీన్ని బట్టి రాజమౌళితో అంత వీజీ కాదనే విషయం అందరూ అర్థం చేసుకోవాల్సిందే.
This post was last modified on December 14, 2021 9:09 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…