‘బాహుబలి’ లాంటి సినిమా ఇంకోటి రాదని బలంగా ఫిక్సయిపోయి ఉన్నారు ప్రేక్షకులు. గత కొన్నేళ్లలో ‘బాహుబలి’ని టార్గెట్ చేస్తూ వివిధ భాషల్లో అలాంటి భారీ చిత్రాలు కొన్ని వచ్చాయి. కానీ ఏవీ దానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. స్వయంగా రాజమౌళి కూడా అలాంటి అద్భుతాన్ని మళ్లీ ఆవిష్కరించలేడనే అభిప్రాయంతో ఉన్నారు ప్రేక్షకులు. జక్కన్న నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ దాని స్థాయిలో బాగానే హైప్ తెచ్చుకున్నప్పటికీ.. ‘బాహుబలి’ స్థాయి యుఫోరియా దీనికి కూడా సాధ్యం కాదని, ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడం కష్టమే అని భావిస్తున్నారు.
ఐతే విజువల్గా ఆర్ఆర్ఆర్.. బాహుబలిని మ్యాచ్ చేయలేకపోవచ్చేమో కానీ.. ఎమోషన్ల పరంగా ఇది ‘బాహుబలి’ని మించిన సినిమానేనట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా రాజమౌళే. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఈ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
“ఎమోషన్ల వరకు తీసుకుంటే కచ్చితంగా ఆర్ఆర్ఆర్.. బాహుబలిని మించే ఉంటుంది కానీ అంతకంటే తగ్గదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారని చాలా నమ్మకంతో ఉన్నాను” అని రాజమౌళి చెప్పాడు. ఈ మాట అనాలంటే చాలా ధైర్యం కావాలి. ‘బాహుబలి’ కేవలం విజువల్ మాయాజాలంతో హిట్టయిపోలేదు. అందులోని ఎమోషన్లు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. మరి దాన్ని మించిన ఎమోషన్లు ‘ఆర్ఆర్ఆర్’లో ఉన్నాయని రాజమౌళి అన్నాడంటే సాహసమనే చెప్పాలి.
ఐతే జక్కన్న ఊరికే హైప్ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే రకం కాదు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ ఎమోషన్లతో ప్రేక్షకులను ఊపేయడం ఖాయం అనుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తాను చేయబోయేది మహేష్ సినిమానే అని మరోసారి రాజమౌళి ధ్రువీకరించాడు. కానీ ఆ సినిమా గురించి ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించే, మాట్లాడే పరిస్థితి లేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా ‘ఆర్ఆర్ఆర్’ మీదే ఉందని.. ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలని.. రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి తాము అనుకున్న స్థాయిలో స్పందన వచ్చాక.. అప్పుడు మహేష్ మూవీ గురించి ఆలోచిస్తానని చెప్పాడు జక్కన్న.
.
This post was last modified on December 11, 2021 10:33 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…