బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నిన్ననే ఇటు కుటుంబ సభ్యులు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం సంగీత్ పార్టీ జరగనుంది. ఇలాంటి సమయంలో వీరి పెళ్లిపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. రాజస్థాన్ కు చెందిన లాయర్ నేత్రబింద్ సింగ్ ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.
దానికి కారణమేంటంటే.. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు ఆనుకొని ఫేమస్ దేవీ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే రిసార్ట్ ను దాటుకొని వెళ్లాలి. అయితే కత్రినా-విక్కీ పెళ్లిని దృష్టిలో పెట్టుకొని రిసార్ట్ నిర్వాహకులు ఆ దారిని బ్లాక్ చేశారు. దీంతో వందలాది మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.
దీంతో లాయర్ నేత్రబింద్ సింగ్ కత్రినా – విక్కీ పెళ్లిపై ఫిర్యాదు చేశారు. ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారని.. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట అని చెప్పుకొచ్చారు నేత్రబింద్.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ దారి మూసేయడం నేత్రబింద్ సింగ్ కి నచ్చలేదట. రోజుకి వందల మంది భక్తులు వచ్చే దారిని మూసేసి వారి మనోభావాలను హర్ట్ చేస్తున్నారంటూ.. ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు నోటీసులు అందాయి. ఇక కత్రినా -విక్కీ వివాహం చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు హోటల్ కు చేరుకుంటున్నారు.
This post was last modified on December 7, 2021 2:26 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…