బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నిన్ననే ఇటు కుటుంబ సభ్యులు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం సంగీత్ పార్టీ జరగనుంది. ఇలాంటి సమయంలో వీరి పెళ్లిపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. రాజస్థాన్ కు చెందిన లాయర్ నేత్రబింద్ సింగ్ ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.
దానికి కారణమేంటంటే.. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు ఆనుకొని ఫేమస్ దేవీ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే రిసార్ట్ ను దాటుకొని వెళ్లాలి. అయితే కత్రినా-విక్కీ పెళ్లిని దృష్టిలో పెట్టుకొని రిసార్ట్ నిర్వాహకులు ఆ దారిని బ్లాక్ చేశారు. దీంతో వందలాది మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.
దీంతో లాయర్ నేత్రబింద్ సింగ్ కత్రినా – విక్కీ పెళ్లిపై ఫిర్యాదు చేశారు. ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారని.. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట అని చెప్పుకొచ్చారు నేత్రబింద్.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ దారి మూసేయడం నేత్రబింద్ సింగ్ కి నచ్చలేదట. రోజుకి వందల మంది భక్తులు వచ్చే దారిని మూసేసి వారి మనోభావాలను హర్ట్ చేస్తున్నారంటూ.. ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు నోటీసులు అందాయి. ఇక కత్రినా -విక్కీ వివాహం చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు హోటల్ కు చేరుకుంటున్నారు.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…