బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నిన్ననే ఇటు కుటుంబ సభ్యులు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం సంగీత్ పార్టీ జరగనుంది. ఇలాంటి సమయంలో వీరి పెళ్లిపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. రాజస్థాన్ కు చెందిన లాయర్ నేత్రబింద్ సింగ్ ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.
దానికి కారణమేంటంటే.. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు ఆనుకొని ఫేమస్ దేవీ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే రిసార్ట్ ను దాటుకొని వెళ్లాలి. అయితే కత్రినా-విక్కీ పెళ్లిని దృష్టిలో పెట్టుకొని రిసార్ట్ నిర్వాహకులు ఆ దారిని బ్లాక్ చేశారు. దీంతో వందలాది మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.
దీంతో లాయర్ నేత్రబింద్ సింగ్ కత్రినా – విక్కీ పెళ్లిపై ఫిర్యాదు చేశారు. ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారని.. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట అని చెప్పుకొచ్చారు నేత్రబింద్.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ దారి మూసేయడం నేత్రబింద్ సింగ్ కి నచ్చలేదట. రోజుకి వందల మంది భక్తులు వచ్చే దారిని మూసేసి వారి మనోభావాలను హర్ట్ చేస్తున్నారంటూ.. ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు నోటీసులు అందాయి. ఇక కత్రినా -విక్కీ వివాహం చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు హోటల్ కు చేరుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…