బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నిన్ననే ఇటు కుటుంబ సభ్యులు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం సంగీత్ పార్టీ జరగనుంది. ఇలాంటి సమయంలో వీరి పెళ్లిపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. రాజస్థాన్ కు చెందిన లాయర్ నేత్రబింద్ సింగ్ ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.
దానికి కారణమేంటంటే.. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు ఆనుకొని ఫేమస్ దేవీ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే రిసార్ట్ ను దాటుకొని వెళ్లాలి. అయితే కత్రినా-విక్కీ పెళ్లిని దృష్టిలో పెట్టుకొని రిసార్ట్ నిర్వాహకులు ఆ దారిని బ్లాక్ చేశారు. దీంతో వందలాది మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.
దీంతో లాయర్ నేత్రబింద్ సింగ్ కత్రినా – విక్కీ పెళ్లిపై ఫిర్యాదు చేశారు. ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారని.. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట అని చెప్పుకొచ్చారు నేత్రబింద్.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ దారి మూసేయడం నేత్రబింద్ సింగ్ కి నచ్చలేదట. రోజుకి వందల మంది భక్తులు వచ్చే దారిని మూసేసి వారి మనోభావాలను హర్ట్ చేస్తున్నారంటూ.. ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు నోటీసులు అందాయి. ఇక కత్రినా -విక్కీ వివాహం చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు హోటల్ కు చేరుకుంటున్నారు.
This post was last modified on December 7, 2021 2:26 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…