గుడ్ లక్ సఖి.. ఎప్పుడో రెండేళ్ల ముందు మొదలైన సినిమా. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో.. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్ లాంటి విలక్షణ చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు నగేష్ కుకునూర్ రూపొందించిన సినిమా ఇది. ఐతే కరోనా వల్ల, వేరే కారణాల వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఒక దశలో ఈ సినిమా అస్సలు వార్తల్లో లేక అందరూ దీని గురించి మరిచిపోయారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందన్న వార్తలు కూడా నిజం కాలేదు.
చివరికి గత నెలలోనే ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నవంబరు 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. కానీ ఆ తేదీకి సినిమా రాలేదు. ఆ తర్వాత డిసెంబరు 10కి డేట్ మార్చారు. మొన్నటి దాకా ఈ డేట్కే కట్టుబడి ప్రమోషన్లు కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో.. ‘గుడ్ లక్ సఖి’ని మళ్లీ వాయిదా వేశారు. ఈసారి ఇచ్చిన కొత్త డేట్.. డిసెంబరు 31.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘అఖండ’ సాగిస్తున్న ప్రభంజనం చూసి భయపడే ‘గుడ్ లక్ సఖి’ని వాయిదా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వారం దానికి పోటీగా వచ్చిన మరక్కార్, స్కైలాబ్ అడ్రస్ లేకుండా పోయాయి. నాలుగు రోజులు గడిచినా ‘అఖండ’ జోరు తగ్గట్లేదు. వీక్ డేస్లో కొంచెం జోరు తగ్గినా రెండో వీకెండ్లో ఈ సినిమా మళ్లీ దూకుడు చూపించే అవకాశాలున్నాయి.
నాగశౌర్య సినిమా ‘లక్ష్య’ కూడా బరిలో ఉండటంతో ‘గుడ్ లక్ సఖి’ లాంటి బజ్ లేని మూవీని జనాలు పట్టించుకోకపోవచ్చు. అందుకే సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తర్వాతి రెండు వారాలకు బెర్తులు బుక్ అయిపోవడంతో ఖాళీగా ఉన్న డిసెంబరు 31వ తేదీని ఎంచుకున్నట్లున్నారు. కానీ ఇన్నిసార్లు వాయిదా పడ్డ సినిమా ఆ రోజైనా కచ్చితంగా రిలీజవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. చూడాలి మరి ‘గుడ్ లక్ సఖి’కి ఎప్పుడు మోక్షం లభిస్తుందో?
This post was last modified on December 5, 2021 10:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…