రాజమౌళి కెరీర్ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే విభజించి చూడాలి. దాని కంటే ముందు కూడా మగధీర, ఈగ లాంటి భారీ చిత్రాలు తీశాడు కానీ.. బాహుబలి లాంటి రీచ్ వాటికి లేదు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే అలాంటి రీచ్ మరే చిత్రానికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాకు సంబంధించి మేకింగ్, ప్రమోషన్, బుకింగ్స్, కలెక్షన్స్.. ఇలా ప్రతిదీ ట్రెండ్ సెట్టింగే.
ఒక సినిమా ట్రైలర్ను థియేటర్లలో రిలీజ్ చేయడం.. అందుకోసం పెద్ద స్థాయిలో ప్లానింగ్ జరగడం.. మూడు నిమిషాల లోపు నిడివి ఉన్న ట్రైలర్ చూసేందుకు అభిమానులు సినిమా చూడ్డానికి వచ్చినట్లు రావడం.. ఇదంతా ఒక కొత్త అనుభవం. ఇండియన్ సినిమాలో నభూతో అనిపించే విజువల్స్ను నేరుగా బిగ్ స్క్రీన్ మీదే చూసి నోరెళ్లబెట్టారు ప్రేక్షకులు. సినిమా మీద అంచనాలు మరింత పెరగడానికి ఆ స్ట్రాటజీ బాగానే ఉపయోగపడింది.
ఇప్పుడు తన కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే ట్రెండ్ కొనసాగించబోతున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఈ నెల 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు మూడో తారీఖే ట్రైలర్ లాంచింగ్ అనుకున్నారు కానీ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో అది వాయిదా పడింది. తాజాగా కొత్త డేట్ ఇచ్చారు.
ఐతే ఈ ట్రైలర్ను కూడా బాహుబలి తరహాలోనే థియేటర్లలో లాంచ్ చేయబోతున్నారట. ఉదయం 10 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్దేశించిన థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారట. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రైలర్ వదులుతారు. గత నెలలో రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ఇప్పటికే థియేటర్లలో వివిద సినిమాల మధ్యలో ప్రదర్శితం అవుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైన ఆడిటోరియాలు షేకైపోవడం ఖాయం.
This post was last modified on December 4, 2021 10:39 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…