రాజమౌళి కెరీర్ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే విభజించి చూడాలి. దాని కంటే ముందు కూడా మగధీర, ఈగ లాంటి భారీ చిత్రాలు తీశాడు కానీ.. బాహుబలి లాంటి రీచ్ వాటికి లేదు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే అలాంటి రీచ్ మరే చిత్రానికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాకు సంబంధించి మేకింగ్, ప్రమోషన్, బుకింగ్స్, కలెక్షన్స్.. ఇలా ప్రతిదీ ట్రెండ్ సెట్టింగే.
ఒక సినిమా ట్రైలర్ను థియేటర్లలో రిలీజ్ చేయడం.. అందుకోసం పెద్ద స్థాయిలో ప్లానింగ్ జరగడం.. మూడు నిమిషాల లోపు నిడివి ఉన్న ట్రైలర్ చూసేందుకు అభిమానులు సినిమా చూడ్డానికి వచ్చినట్లు రావడం.. ఇదంతా ఒక కొత్త అనుభవం. ఇండియన్ సినిమాలో నభూతో అనిపించే విజువల్స్ను నేరుగా బిగ్ స్క్రీన్ మీదే చూసి నోరెళ్లబెట్టారు ప్రేక్షకులు. సినిమా మీద అంచనాలు మరింత పెరగడానికి ఆ స్ట్రాటజీ బాగానే ఉపయోగపడింది.
ఇప్పుడు తన కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే ట్రెండ్ కొనసాగించబోతున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఈ నెల 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు మూడో తారీఖే ట్రైలర్ లాంచింగ్ అనుకున్నారు కానీ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో అది వాయిదా పడింది. తాజాగా కొత్త డేట్ ఇచ్చారు.
ఐతే ఈ ట్రైలర్ను కూడా బాహుబలి తరహాలోనే థియేటర్లలో లాంచ్ చేయబోతున్నారట. ఉదయం 10 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్దేశించిన థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారట. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రైలర్ వదులుతారు. గత నెలలో రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ఇప్పటికే థియేటర్లలో వివిద సినిమాల మధ్యలో ప్రదర్శితం అవుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైన ఆడిటోరియాలు షేకైపోవడం ఖాయం.
This post was last modified on December 4, 2021 10:39 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…