యూట్యూబ్లో, అలాగే హిందీ ఛానెళ్లలో డబ్బింగ్ సినిమాల ద్వారా మన స్టార్ హీరోలందరికీ ఉత్తరాదిన గత కొన్నేళ్లలో బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో కొత్తగా ఇక్కడ ఏ సినిమా రిలీజైనా కూడా వాటి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నార్త్ మార్కెట్లో చిన్న స్థాయిలో సినిమాలు రిలీజైనా అక్కడుండే తెలుగు వాళ్లతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా మన సినిమాలు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా పట్ల కూడా నార్త్ ఫ్యాన్స్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. బాలీవుడ్లో ఇలాంటి మాస్ సినిమాలు బాగా కరవైపోవడంతో బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలపై బాగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అఖండ గురించి ఉత్తరాది ప్రేక్షకుల్లో ఒక చర్చ నడుస్తుండటం విశేషం. బాలీవుడ్లో వచ్చే సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో హిందుత్వాన్ని కించపరచడం ఫ్యాషన్ అయిపోయిందని.. ఎంతసేపూ క్రిస్టియానిటీని, ఇస్లాంను వాళ్లు ప్రమోట్ చేస్తుంటారని.. ఆ మతాల పట్ల సానుకూల భావాన్ని చూపిస్తూ, హిందుత్వం మీద విషం చిమ్మడం మామూలైపోయిందని అంటున్నారు.
బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇలా ఉంటే.. సౌత్ సినిమాల్లో మాత్రం హిందుత్వం గురించి పాజిటివ్గా చూపిస్తున్నారని.. ముఖ్యంగా అఖండ మూవీలో హిందుత్వ ధర్మం గురించి.. దేవాలయాల ప్రాధాన్యం గురించి చాలా గొప్పగా చెప్పారని.. హిందూ ఐడియాలజీని సానుకూల ధోరణిలో చూపించారని.. ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా అవసరమని నార్త్ ఆడియన్స్ పోస్టులు పెడుతుండటం విశేషం. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తమ మూలాలను మరిచిపోతున్నారని.. అఖండ మూవీని చూసి వాళ్లు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు. తెలుగు వారిలో కూడా హిందు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆరాధ్య భావం ఉన్న వాళ్లందరూ అఖండను కొనియాడుతున్నారు.
This post was last modified on December 4, 2021 11:07 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…