నందమూరి నటసింహం, మాస్ కా బాప్ బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ ఏస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం ‘అఖండ’ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ ‘అఖండ’ విజయంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.
‘అఖండ’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. కొత్తదనాన్ని ఆదరించే మంచి గుణం మన తెలుగువాళ్లకు ఎప్పుడూ ఉంటుందని కొనియాడారు. ఈ ‘అఖండ’ విజయం మొత్తం సినీ పరిశ్రమ విజయమని చెప్పారు.ఒకప్పుడు భక్తిని రామారావు బ్రతికించారని, ఇప్పుడు భక్తిని ‘అఖండ’ బ్రతికించిందని బాలయ్య ఎమోషన్ అయ్యారు. ఈ చిత్రంలో తెరపై తన నటనను చూసి తానే కాస్త ఆశ్చర్యపోయానని వ్యాఖ్యానించారు.
తాను కేవలం తన దర్శకుడి సూచనలను పాటిస్తానని… తనకు అన్ని సినిమాలు సమానమేనని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని బాలకృష్ణ కితాబిచ్చారు. ఇక, థియేటర్లలో అయితే బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించే దిశగా కలెక్షన్లు వస్తుండడంతో చాలాకాలంగా చప్పగా ఉన్న బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ హిట్ టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.
This post was last modified on December 3, 2021 4:15 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…