నందమూరి బాలకృష్ణ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడు. ఐతే అలాంటి సినిమాలు యుఎస్లో అంతగా ఆడవు. ఆయన నుంచి వచ్చిన డిఫరెంట్ మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి మాత్రం అక్కడ మంచి ఫలితం దక్కించుకుంది. దాదాపు 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి ఆ చిత్రానికి యుఎస్లో. కానీ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన సినిమాలన్నీ యుఎస్లో నిరాశ పరిచాయి. బాలయ్య నుంచి చివరగా వచ్చిన ‘రూలర్’ మూవీకి యుఎస్లో కనీస స్పందన కూడా రాలేదు. అంతకుముందు రిలీజైన ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలకూ నిరాశాజనక ఫలితమే వచ్చింది.
కానీ ఈ ప్రభావం బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ మీద ఎంతమాత్రం పడలేదు. ఇది రొటీన్ మాస్ మసాలా సినిమానే. మామూలుగా అయితే ఈ సినిమాకు అక్కడ తిరస్కారమే ఎదురవ్వాలి. కానీ ‘అఖండ’ అక్కడ సంచలనం రేపుతోంది. ప్రిమియర్ల సందర్భంగా హంగామా మామూలుగా లేదు.డల్లాస్లో వందల కార్లతో ర్యాలీ చేయడమేంటి.. కాలిఫోర్నియాలో థియేటర్ల ముందు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడమేంటి.. ఇక థియేటర్లలో అయితే ఆంధ్రా ప్రాంతంలో మాస్ సెంటర్లలో మాదిరి రచ్చ రచ్చ చేయడమేంటి.. మొత్తంగా యుఎస్లో ‘అఖండ’ సందడి అలా ఇలా లేదు.
ఈ చిత్రానికి ప్రిమియర్ల ద్వారానే 3.3 లక్షల డాలర్ల వసూళ్లు రావడం విశేషం. బాలయ్య ఏ చిత్రానికీ ప్రిమియర్లతో ఈ స్థాయి వసూళ్లు రాలేదు. ఇదంతా బాలయ్య అభిమానులు, ఎన్నారై టీడీపీ మద్దతుదారులు ‘అఖండ’ను చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం వల్లే సాధ్యమైంది. బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ మద్దతుదారులు అక్కడ థియేటర్లకు థియేటర్లు మొత్తంగా తమ కోసం బుక్ చేసేశారు. దీంతో షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. బోయపాటితో బాలయ్య సినిమా అంటే వారికున్న గురే వేరు. అందుకే ముందే భారీగా టికెట్లు సేల్ అయ్యాయి. టాక్తో సంబంధం లేకుండా సినిమా 3 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టేసింది. వీకెండ్ అంతా ఈ సందడి కొనసాగేలాగే కనిపిస్తోంది.
This post was last modified on December 3, 2021 3:28 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…