శ్రీకాంత్ అనగానే అతను చేసిన కుటుంబ కథా చిత్రాలు, సాఫ్ట్ లవ్ స్టోరీలే గుర్తుకొస్తాయి. కెరీర్ ఆరంభంలో కొన్ని నెగెటివ్ రోల్స్ చేసినప్పటికీ.. హీరోగా స్థిరపడ్డాక మాత్రం సాఫ్ట్ సినిమాలకే పరిమితం అయ్యాడు. అతడికి వచ్చిన ఇమేజ్ కూడా అలాంటిదే. అలాంటి వాడికి ‘అఖండ’ సినిమాలో చాలా వయొలెంట్ రోల్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. హీరోగా అవకాశాలు తగ్గాక కూడా క్యారెక్టర్ రోల్స్ సైతం సాఫ్ట్గా ఉన్నవే చేసిన శ్రీకాంత్ను మళ్లీ విలన్ని చేయాలన్న ఆలోచనే ఆశ్చర్యం కలిగించేది. అలాంటిది వయొలెంట్ క్యారెక్టర్ చేయించడం ఇంకా చిత్రం. ఇంతకుముందే ‘యుద్ధం శరణం’లో మళ్లీ విలన్ పాత్ర చేసినా అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇప్పుడు ‘అఖండ’తో అయినా శ్రీకాంత్ కెరీర్ మలుపు తిరుగుతుందా.. ‘లెజెండ్’లో జగపతిబాబు లాగే శ్రీకాంత్కు కూడా గొప్ప పేరొచ్చి అతడి దశ తిరిగిపోతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.కానీ ‘అఖండ’లో శ్రీకాంత్ ఎంత బాగా చేసినప్పటికీ.. అతను చేసిన వరద రాజులు పాత్ర అయితే అనుకున్నంతగా పండలేదు. ఆ పాత్ర ఇంట్రో సీన్ చాలా భయంకరంగా ఉండి దానిపై అంచనాలు పెంచుతుంది కానీ.. తర్వాత ఆ పాత్ర గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. బాలయ్యతో ఫస్ట్ ఫేస్ ఆఫ్ సీన్లో ఇద్దరూ పంచ్ డైలాగులు పేల్చుకున్నారే తప్ప అందులో అంతగా విషయం లేదు.
ఆ తర్వాత కూడా శ్రీకాంత్ పాత్ర సాధారణంగా సాగిపోతుంది. మెయిన్ విలన్గా వేరే వ్యక్తిని పెట్టడం.. ఆ పాత్రతోనే క్లైమాక్స్ ప్లాన్ చేయడం.. అంతకంటే ముందే సింపుల్గా రెండో బాలయ్య చేతిలో శ్రీకాంత్ పాత్ర హతమవ్వడంతో ఈ పాత్ర సడెన్గా, సింపుల్గా ముగిసిపోయినట్లు అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే శ్రీకాంత్ క్యారెక్టర్ వెయ్యాల్సిన ఇంపాక్ట్ అయితే వెయ్యలేదు. దీని తర్వాత మిగతా దర్శకులు కూడా శ్రీకాంత్కు విలన్ రోల్స్ ఆఫర్ చేస్తారా.. అతడికి సరైన పాత్రలు పడతాయా అన్నది సందేహంగానే ఉంది.
This post was last modified on December 3, 2021 12:53 pm
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…