మరక్కార్.. మరక్కార్.. కొన్ని రోజులుగా పాన్ ఇండియా లెవెల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఆయన మిత్రుడు, లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన భారీ చిత్రమిది. మాలీవుడ్లో తొలిసారిగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాను అక్కడి వాళ్లు తమ బాహుబలిగా భావించారు. నిజానికి ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి ఓటీటీ రిలీజ్కు డీల్ కూడా చేసుకున్నాక.. మళ్లీ మనసు మార్చుకుని ఎట్టకేలకు గురువారం థియేట్రికల్ రిలీజ్ ద్వారానే మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
విడుదలకు ముందే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుని.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు ఆశించినంత మంచి టాక్ అయితే రాలేదు.విజువల్గా ‘మరక్కార్’ అద్భుతం అనిపించినా.. కథాకథనాలు అంత ఆసక్తికరంగా లేవంటున్నారు. కథ గందరగోళంగా ఉందని.. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారని.. ఎమోషన్ సరిగా పండలేదని అంటున్నారు. అందరూ మోహన్ లాల్ పెర్ఫామెన్స్ను కొనియాడుతున్నప్పటికీ.. పకడ్బందీ స్క్రీన్ ప్లే లేని ఈ సినిమాను ఆయన కూడా కాపాడలేకపోయాడు అంటున్నారు. అలా అని ఇది తీసి పడేసే సినిమా కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
టీజర్లు, ట్రైలర్లు చూసి ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు సినిమా దూరంలో నిలిచిపోయిందన్ని మెజారిటీ జనాలు చెబుతున్న మాట. ఐతే టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే గ్యారెంటీ. కేరళలో ప్యాక్డ్ హౌసెస్తో సినిమా నడుస్తోంది. ఓవర్సీస్లో సినిమాకు రెస్పాన్స్ అదిరిపోతోంది. వీకెండ్ వరకు ‘మరక్కార్’ వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత సినిమా ఏమేర నిలుస్తుందన్నదే సందేహం. ఈ చిత్రం తెలుగులో ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం విడుదల కానుంది.
This post was last modified on December 2, 2021 6:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…