ఆంధ్రప్రదేశ్ కొన్ని రోజుల నుంచి వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల కిందటే భారీ వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వరదలు ముంచెత్తున్నాయి. దశాబ్దాల వ్యవధిలో ఎన్నడూ జరగనంత నష్టం జరిగింది. జనాలు సర్వస్వం కోల్పోయి కట్టూ బట్టతో నిలిచారు.
ఐతే ఏపీ జనం ఇంతలా అల్లాడిపోతుంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన లేదని.. ఎలాంటి సాయం అందలేదని వైకాపా నేతలు కొన్ని రోజుల కిందట విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి అప్పుడు ఏ స్పందనా లేకపోయింది. ఐతే బుధవారం ఉన్నట్లుండి వరుసబెట్టి టాలీవుడ్ హీరోలు ఏపీ వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించడం మొదలుపెట్టారు.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలతో మొదలుపెడితే.. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్.. ఇలా ఒక్కొక్కరు సరిగ్గా అదే మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ఐతే అందరూ ఒకే మొత్తం విరాళం ప్రకటించడం.. కొంత సమయం వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు సాయం ప్రకటించడం చూస్తే ఇది ముందే అనుకుని ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న వ్యవహారంలా కనిపిస్తోంది.
ఏపీలో టికెట్ల రేట్లను నిర్దేశిస్తూ జీవో రిలీజ్ చేసిన కాసేపటికే హీరోలు ఇలా విరాళాలు ప్రకటించడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఈ విషయంలో ఏదైనా ఒత్తిడి వచ్చి వీళ్లిలా ఒకేసారి అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారా.. లేక టికెట్ల ధరలు ప్రకటించిన నేపథ్యంలో వరద బాధితులకు సాయం ప్రకటించడం ద్వారా జగన్ మనసు మార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా అయితేనేం సినీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్న ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా ఓ కొలిక్కి రావాలని ఇండస్ట్రీ జనాలు కోరుకుంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…