ఆంధ్రప్రదేశ్ కొన్ని రోజుల నుంచి వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల కిందటే భారీ వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వరదలు ముంచెత్తున్నాయి. దశాబ్దాల వ్యవధిలో ఎన్నడూ జరగనంత నష్టం జరిగింది. జనాలు సర్వస్వం కోల్పోయి కట్టూ బట్టతో నిలిచారు.
ఐతే ఏపీ జనం ఇంతలా అల్లాడిపోతుంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన లేదని.. ఎలాంటి సాయం అందలేదని వైకాపా నేతలు కొన్ని రోజుల కిందట విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి అప్పుడు ఏ స్పందనా లేకపోయింది. ఐతే బుధవారం ఉన్నట్లుండి వరుసబెట్టి టాలీవుడ్ హీరోలు ఏపీ వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించడం మొదలుపెట్టారు.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలతో మొదలుపెడితే.. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్.. ఇలా ఒక్కొక్కరు సరిగ్గా అదే మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ఐతే అందరూ ఒకే మొత్తం విరాళం ప్రకటించడం.. కొంత సమయం వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు సాయం ప్రకటించడం చూస్తే ఇది ముందే అనుకుని ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న వ్యవహారంలా కనిపిస్తోంది.
ఏపీలో టికెట్ల రేట్లను నిర్దేశిస్తూ జీవో రిలీజ్ చేసిన కాసేపటికే హీరోలు ఇలా విరాళాలు ప్రకటించడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఈ విషయంలో ఏదైనా ఒత్తిడి వచ్చి వీళ్లిలా ఒకేసారి అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారా.. లేక టికెట్ల ధరలు ప్రకటించిన నేపథ్యంలో వరద బాధితులకు సాయం ప్రకటించడం ద్వారా జగన్ మనసు మార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా అయితేనేం సినీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్న ఈ సమస్య సాధ్యమైనంత త్వరగా ఓ కొలిక్కి రావాలని ఇండస్ట్రీ జనాలు కోరుకుంటున్నారు.
This post was last modified on December 1, 2021 10:17 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…