Movie News

రామ్ చరణ్, అలియాపై ప్రమోషనల్ సాంగ్!

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పనులన్నీ ఎప్పుడో పూర్తి చేసేశారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా దాదాపు పూర్తయినట్లే. సినిమా నిడివి మూడు గంటల పాటు ఉంటుందని సమాచారం. జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. దీంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. సినిమా నుంచి టీజర్లు, పాటలను విడుదల చేస్తూ.. రోజురోజుకి అంచనాలను పెంచేస్తున్నారు. డిసెంబర్ 3న సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది.

ఇలాంటి సమయంలో రాజమౌళి మరోసారి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి ఓ ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించాలని భావిస్తున్నారు. రామ్ చరణ్, అలియాభట్ ల మీదే ఈ ప్రమోషనల్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. సినిమాలో వారిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ పెద్దగా ఉండదట. దీంతో ఇద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తే.. బాలీవుడ్ మార్కెట్ లో మరింత ప్రమోట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. 

కానీ ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ట్రైలర్ ఇంటర్నేషనల్ రేంజ్ లో వైరల్ అయితే.. ప్రమోషనల్ సాంగ్ ఐడియాను పక్కన పెట్టేస్తారట. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.700 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. నిజానికి కోవిడ్ గనుక లేకపోతే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటుంది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago