తెలుగు ‘బిగ్ బాస్’ ఐదో సీజన్ మొదలైనపుడు షోలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడవుతాడని.. ఫైనల్ వరకు ఉంటాడని అంచనా వేసిన వాళ్లలో యాంకర్ రవి ఒకడు. ఈసారి షోలో పాల్గొన్నవారిలో ఎక్కువ ఫేమ్ ఉన్నది అతడికే అని చెప్పాలి. కాకపోతే యాంకర్గా రవిని అభిమానించే వాళ్లతో పాటు అతడి యాటిట్యూడ్ నచ్చని వాళ్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. కాబట్టి అతను షోలో ఎంత వరకు సర్వైవ్ అవుతాడో అన్న డౌట్లు కూడా కలిగాయి.
రవి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంత త్వరగా అయితే షో నుంచి బయటికి వెళ్లడని అనుకున్నారు. కాబట్టే ఇన్నాళ్లూ అతను విజయవంతంగా హౌస్లో కొనసాగుతూ వచ్చాడు. కానీ ‘బిగ్ బాస్’ చివరి దశకు వస్తున్న తరుణంలో అతను వేటు నుంచి తప్పించుకోలేకపోయాడు. గత వారం ఎలిమినేషన్ జాబితాలోకి వచ్చిన అతడికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడటంతో షో నుంచి నిష్క్రమించక తప్పలేదు.
ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కావడానికి రెండు రోజుల ముందే రవి వైదొలగబోతున్నాడని వార్తలు బయటికి వచ్చేశాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ చివరి దశలో కాజల్ సేవ్ అయింది. రవి ఎలిమినేట్ అయ్యాడు. ఐతే బయట రవిని అభిమానించే వాళ్లకు ఈ విషయం మింగుడు పడలేదు. ‘బిగ్ బాస్’ షో నడుస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. రవి షో నుంచి వైదొలగడానికి వీల్లేదని.. ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి అతణ్ని మళ్లీ హౌస్లోకి పంపాలని డిమాండ్ చేస్తున్న తన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ గేటు బయట నిలబడి గొడవ డొడవ చేశారు.
దీంతో కొంతసేపు ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. కాగా యాంకర్ రవికి ఉన్న పాపులారిటీ వల్ల అతను బిగ్ బాస్ విజేతను మించి పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వారానికి ఏడెనిమిది లక్షల చొప్పున ఇప్పటిదాకా షో నడిచిన 12 వారాలకు గాను దాదాపు కోటి రూపాయల పారితోషకాన్ని అతను పుచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on November 29, 2021 3:41 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…