మరక్కార్: ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ.. మలయాళ సినిమా పరిశ్రమలో ఒక ‘బాహుబలి’ అవుతుందని అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా. మాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా, రూ.100 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. హాలీవుడ్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ తరహాలో తెరకెక్కించిన భారీ చిత్రమిది.
విడుదలకు ముందే జాతీయ అవార్డుల్లో పోటీ పడి 2021 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా దక్కించుకుంది ‘మరక్కార్’. టీజర్, ట్రైలర్లతో భారీగా అంచనాలు రేకెత్తించిన ‘మరక్కార్’ను ఒక దశలో ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని.. ఆ తర్వాత ఆ డీల్ క్యాన్సిల్ చేసి డిసెంబరు 2న థియేట్రికల్ రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్రణాళిక.
ముందు నుంచి తెలుగులోనూ ప్రమోషన్లు చేస్తున్నారు. కానీ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి కథ మారిపోయింది. ఏమైందో ఏమో కానీ.. ‘మరక్కార్’ను డిసెంబరు 2న తెలుగులో రిలీజ్ చేయట్లేదు. మిగతా నాలుగు భాషల్లోనూ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం కొత్తగా రిలీజ్ టీజర్ వదలగా.. అది నాలుగు భాషలకే పరిమితం అయింది. రిలీజ్ పోస్టర్లు కూడా ఆ నాలుగు భాషల్లోనే ఉన్నాయి.
తెలుగులో థియేటర్ల బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఓటీటీల ద్వారా మోహన్ లాల్ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు తెలుగు జనాలు. అంతకుముందు జనతా గ్యారేజ్, పులి మురుగన్ లాంటి సినిమాలు కూడా ఆయనకు తెలుగులో మంచి ఆదరణ తెచ్చాయి. మోహన్ లాల్తో పాటు కీర్తి సురేష్, అర్జున్, కళ్యాణి ప్రియదర్శన్ లాంటి తెలుగు వాళ్లకు పరిచయమున్న నటీనటులు కీలక పాత్రలు పోషించడం కూడా ‘మరక్కార్’ ఆసక్తిని పెంచేదే. కానీ ఈ భారీ చిత్రాన్ని తెలుగులో ఎందుకు రిలీజ్ చేయట్లేదన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఇది మన వాళ్లకు నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on November 28, 2021 1:55 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…