మరక్కార్: ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ.. మలయాళ సినిమా పరిశ్రమలో ఒక ‘బాహుబలి’ అవుతుందని అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా. మాలీవుడ్లో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా, రూ.100 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. హాలీవుడ్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ తరహాలో తెరకెక్కించిన భారీ చిత్రమిది.
విడుదలకు ముందే జాతీయ అవార్డుల్లో పోటీ పడి 2021 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా దక్కించుకుంది ‘మరక్కార్’. టీజర్, ట్రైలర్లతో భారీగా అంచనాలు రేకెత్తించిన ‘మరక్కార్’ను ఒక దశలో ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని.. ఆ తర్వాత ఆ డీల్ క్యాన్సిల్ చేసి డిసెంబరు 2న థియేట్రికల్ రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్రణాళిక.
ముందు నుంచి తెలుగులోనూ ప్రమోషన్లు చేస్తున్నారు. కానీ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి కథ మారిపోయింది. ఏమైందో ఏమో కానీ.. ‘మరక్కార్’ను డిసెంబరు 2న తెలుగులో రిలీజ్ చేయట్లేదు. మిగతా నాలుగు భాషల్లోనూ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం కొత్తగా రిలీజ్ టీజర్ వదలగా.. అది నాలుగు భాషలకే పరిమితం అయింది. రిలీజ్ పోస్టర్లు కూడా ఆ నాలుగు భాషల్లోనే ఉన్నాయి.
తెలుగులో థియేటర్ల బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఓటీటీల ద్వారా మోహన్ లాల్ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు తెలుగు జనాలు. అంతకుముందు జనతా గ్యారేజ్, పులి మురుగన్ లాంటి సినిమాలు కూడా ఆయనకు తెలుగులో మంచి ఆదరణ తెచ్చాయి. మోహన్ లాల్తో పాటు కీర్తి సురేష్, అర్జున్, కళ్యాణి ప్రియదర్శన్ లాంటి తెలుగు వాళ్లకు పరిచయమున్న నటీనటులు కీలక పాత్రలు పోషించడం కూడా ‘మరక్కార్’ ఆసక్తిని పెంచేదే. కానీ ఈ భారీ చిత్రాన్ని తెలుగులో ఎందుకు రిలీజ్ చేయట్లేదన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఇది మన వాళ్లకు నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on November 28, 2021 1:55 pm
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…