‘కల్కి’ తర్వాత రాజశేఖర్ కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఏ సినిమా చేయాలో ఎంచుకోవాలనే విషయంలో కన్ఫ్యూజన్తో ఆయన దాదాపు ఏడాదికి పైగానే ఖాళీగా ఉండిపోయాడు. వీరభద్రం చౌదరితో ఓ సినిమా అనుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ‘కపటధారి’ సినిమాను ఓకే చేసి దాన్నుంచి తప్పుకున్నాడు.
తర్వాత మలయాళ మూవీ ‘జోసెఫ్’ను రీమేక్ చేయడానికి ఆయన రెడీ అవడం.. ‘శేఖర్’ పేరుతో ఈ సినిమాను ప్రకటించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాక రాజశేఖర్ కరోనా బారిన పడటంతో కొన్ని నెలల పాటు ఈ సినిమా హోల్ట్లో ఉంది. తర్వాత ఇది సెట్స్ మీదికి వెళ్లింది. ఇప్పుడు ఫస్ట్ టీజర్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘శేఖర్’ మూవీ. ఐతే ఇందులో డైరెక్టర్ పేరు చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ చిత్రానికి ముందు ప్రకటించిన దర్శకుడి పేరు లలిత్. ఫస్ట్ లుక్లో ఆ పేరే ఉంది.
కానీ ఇప్పుడు టీజర్ రిలీజయ్యే టైంకి డైరెక్టర్ మారిపోయారు. రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖరే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. మరి మధ్యలో ఏం జరిగింది.. దర్శకుడిగా లలిత్ స్థానంలోకి జీవిత ఎందుకు వచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా తన భర్త సినిమాల విషయంలో జీవిత మధ్యలో ఛార్జ్ తీసుకోవడం కొత్తేమీ కాదు. ‘ఎవడైతే నాకేంటి’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. బేసిగ్గా ఆ చిత్రానికి దర్శకుడు సముద్ర అయినప్పటికీ.. మధ్యలో ఆ బాధ్యతలు జీవిత తీసుకున్నారు.
ఇదే కాక రాజశేఖర్ హీరోగా ఆమె శేషు, ఎవడైతే నాకేంటి, ఆప్తుడు, మహంకాళి చిత్రాలను కూడా తెరకెక్కించారు. ఇందులో దాదాపుగా అన్నీ రీమేక్లే. ‘శేఖర్’ సైతం రీమేకే కావడంతో జీవితకు పెద్దగా ఇబ్బంది లేనట్లే కనిపిస్తోంది. ఈ సినిమా కోసం కెరీర్లో తొలిసారిగా పూర్తిగా తెల్లటి గడ్డంతో డిఫరెంట్ లుక్లోకి మారాడు రాజశేఖర్. ఒరిజినల్ మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ మూవీ కావడంతో తెలుగులోనూ ఇది వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 26, 2021 8:28 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…