అక్కినేని నాగచైతన్యతో సమంత పెళ్లి నాలుగేళ్లు తిరగకుండానే విఫలం కావడం.. ఇద్దరూ కొన్ని నెలల కిందటే విడిపోవడం అభిమానులకు ఇంకా జీర్ణం కావడం లేదు. టాలీవుడ్ అనే కాక ఇండియన్ సినిమాలోనే మోస్ట్ లవబుల్ పెయిర్ లాగా కనిపించిన వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. ఇంత త్వరగా విడిపోతారని, విడాకులు తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఇందుకు దారి తీసిన కారణాల పట్ల విపరీతమైన చర్చ జరిగింది. వీరిలో ఎవరు ఎవరిని వద్దనుకున్నారు అనే చర్చ కూడా నడిచింది.
ఐతే గత కొన్ని నెలల్లో చైతూ, సమంతల ప్రవర్తన చూస్తే మాత్రం కచ్చితంగా సమంతలోనే ఎక్కువ ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. చైతూనే ఆమెను వేరేలా అర్థం చేసుకుని, తనను వద్దనుకున్నాడేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. తమ విడాకుల సంగతి ఇంకా బయటికి రాని టైంలో తిరుమలకు వచ్చిన సమంతను ఓ విలేకరి దీని గురించి ప్రశ్నిస్తే ఆమె బుద్ధుందా అంటూ చిరాకు పడ్డ తీరును బట్టి తన ఫ్రస్టేషన్ అర్థమైపోయింది.
ఇక ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో సమంత పెట్టిన కొన్ని ఇన్ డైరెక్ట్ పోస్టుల్ని బట్టి కూడా చైతూ నుంచి విడిపోవడం ఆమెను బాధిస్తోందని అర్థమైంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో సమంతను చూసిన వాళ్లకు కూడా ఆమె బాధలో ఉందనే భావన కలిగింది. ఇక తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు సమంత వ్యవహరించిన తీరు.. ఆమె ఎంతగా హర్ట్ అయిందో తెలియజేస్తుంది.
గతంలో సినీ జంటలు విడిపోయాక ఒకరినొకరు బర్త్డేల సమయంలో విష్ చేసుకోవడం.. జంటగా విడిపోయినా, ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించడం గమనింవచ్చు. కానీ సమంత మాత్రం అలా చేయలేదు. చైతూ పుట్టిన రోజు నాడు తనకు విష్ చేయలేదు. సరి కదా తన పెట్ డాగ్ బర్త్ డేను సెలబ్రెట్ చేసి సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని బట్టి చైతూ విషయంలో ఆమె బాగా హర్ట్ అయిందని.. అయిష్టంగా తన నుంచి విడిపోయిందని.. ఆ కోపాన్ని ఇలా పరోక్షంగా చూపిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 25, 2021 9:12 pm
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…