అక్కినేని నాగచైతన్యతో సమంత పెళ్లి నాలుగేళ్లు తిరగకుండానే విఫలం కావడం.. ఇద్దరూ కొన్ని నెలల కిందటే విడిపోవడం అభిమానులకు ఇంకా జీర్ణం కావడం లేదు. టాలీవుడ్ అనే కాక ఇండియన్ సినిమాలోనే మోస్ట్ లవబుల్ పెయిర్ లాగా కనిపించిన వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. ఇంత త్వరగా విడిపోతారని, విడాకులు తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఇందుకు దారి తీసిన కారణాల పట్ల విపరీతమైన చర్చ జరిగింది. వీరిలో ఎవరు ఎవరిని వద్దనుకున్నారు అనే చర్చ కూడా నడిచింది.
ఐతే గత కొన్ని నెలల్లో చైతూ, సమంతల ప్రవర్తన చూస్తే మాత్రం కచ్చితంగా సమంతలోనే ఎక్కువ ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. చైతూనే ఆమెను వేరేలా అర్థం చేసుకుని, తనను వద్దనుకున్నాడేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. తమ విడాకుల సంగతి ఇంకా బయటికి రాని టైంలో తిరుమలకు వచ్చిన సమంతను ఓ విలేకరి దీని గురించి ప్రశ్నిస్తే ఆమె బుద్ధుందా అంటూ చిరాకు పడ్డ తీరును బట్టి తన ఫ్రస్టేషన్ అర్థమైపోయింది.
ఇక ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో సమంత పెట్టిన కొన్ని ఇన్ డైరెక్ట్ పోస్టుల్ని బట్టి కూడా చైతూ నుంచి విడిపోవడం ఆమెను బాధిస్తోందని అర్థమైంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో సమంతను చూసిన వాళ్లకు కూడా ఆమె బాధలో ఉందనే భావన కలిగింది. ఇక తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు సమంత వ్యవహరించిన తీరు.. ఆమె ఎంతగా హర్ట్ అయిందో తెలియజేస్తుంది.
గతంలో సినీ జంటలు విడిపోయాక ఒకరినొకరు బర్త్డేల సమయంలో విష్ చేసుకోవడం.. జంటగా విడిపోయినా, ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించడం గమనింవచ్చు. కానీ సమంత మాత్రం అలా చేయలేదు. చైతూ పుట్టిన రోజు నాడు తనకు విష్ చేయలేదు. సరి కదా తన పెట్ డాగ్ బర్త్ డేను సెలబ్రెట్ చేసి సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని బట్టి చైతూ విషయంలో ఆమె బాగా హర్ట్ అయిందని.. అయిష్టంగా తన నుంచి విడిపోయిందని.. ఆ కోపాన్ని ఇలా పరోక్షంగా చూపిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…