ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల గొడవ ఎంతకీ తెగట్లేదు. త్వరలో పరిస్థితి మారుతుందని నెలల తరబడి ఎదురు చూస్తున్నా సానుకూల సంకేతాలేమీ కనిపించడం లేదు. మిగతా విన్నపాల సంగతెలా ఉన్నప్పటికీ.. బి-సి సెంటర్లలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్లను అనుసరించి టికెట్లు అమ్మడమంటే చాలా కష్టమని, కామన్ రేటు రూ.100 ఉండేలా చూడాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కోరుతున్నారు.
కానీ ప్రభుత్వం ఆ దిశగా సానుకూలత వ్యక్తం చేసినట్లే చేసి నిర్ణయం మాత్రం తీసుకోవట్లేదు. రెండు నెలల కిందట రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయడం.. తాజాగా చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యల దాడి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో జగన్ సర్కారు మరింత ఇగోకు వెళ్లినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హడావుడిగా కొన్ని తీర్మానాలతో బిల్లు పెట్టి అసెంబ్లీలో ఆమోద ముద్ర కూడా వేసేశారు.
దీంతో వచ్చే వారం విడుదల కాబోయే అఖండను మొదలుకుని ఆ తర్వాత షెడ్యూల్ అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలకు గట్టి దెబ్బ తప్పదని తేలిపోయింది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో తగ్గి ఉంటూ వారిని ప్రాధేయపడుతూ వచ్చిన సినీ పెద్దలు ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం చెబుతున్న రేట్లతో టికెట్లు అమ్మితే మాత్రం భారీ గండి తప్పదు. ఓవైపు అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమా టికెట్ల రేట్లను మాత్రం ప్రభుత్వం నియంత్రించడం ఎంతవరకు సహేతుకం అన్న లాజికల్ ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో ఇక కోర్టులో పోరాడటం తప్ప వేరే మార్గం లేదు. నిజానికి ఈ దిశగా ఇంతకుముందే ఆలోచన చేశారు కానీ.. ప్రభుత్వం మనసు మార్చుకుంటుందేమో అని చూశారు.
కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని, ప్రైవేటు వ్యక్తులు నిర్మించే సినిమా మీద ప్రభుత్వ పెత్తనం ఏంటన్న వాదన వస్తుందని, ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కొట్టి వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఎదురెళ్తే ఏమవుతుందో ఏమో అన్న భయం నిర్మాతల్లో ఉండటం సహజం. కాబట్టి ఇంకోసారి సంప్రదింపుల కోసం ప్రయత్నించి అప్పటికీ పరిస్థితి మారకుంటే కోర్టుకెళ్లడం మినహా మరో మార్గం లేనట్లే.
This post was last modified on November 24, 2021 9:42 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…