లాక్ డౌన్ సమయంలో ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఓటీటీలో దొరుకుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో సినిమాలను తీసి ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఆ విధంగా భారీ లాభాలను పొందుతున్నారు. ఇప్పుడు హీరో నితిన్ కూడా అదే చేస్తున్నాడట. ఇటీవల నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నటించడంతో పాటు తన సొంత బ్యానర్ లో నిర్మించాడు నితిన్. అందుకే థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఎలా ప్రమోషన్స్ చేస్తారో.. అదే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించాడు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. నితిన్ కి మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. ఏకంగా పదిహేను కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఓటీటీకి సినిమా తీసి ఇవ్వడంలో ఇన్ని లాభాలు వస్తాయనే విషయాన్ని గ్రహించిన నితిన్ ఇప్పుడు ఓటీటీ కోసం మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ డైరెక్టర్లను ఓటీటీకి సరిపడా కథ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాడట. సింపుల్ కథను తీసుకొని.. తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ హీరో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఓటీటీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. మరి నితిన్ కి సూటయ్యే కథ దొరుకుతుందేమో చూడాలి!
This post was last modified on November 22, 2021 2:33 pm
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…