లాక్ డౌన్ సమయంలో ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఓటీటీలో దొరుకుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో సినిమాలను తీసి ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఆ విధంగా భారీ లాభాలను పొందుతున్నారు. ఇప్పుడు హీరో నితిన్ కూడా అదే చేస్తున్నాడట. ఇటీవల నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నటించడంతో పాటు తన సొంత బ్యానర్ లో నిర్మించాడు నితిన్. అందుకే థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఎలా ప్రమోషన్స్ చేస్తారో.. అదే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించాడు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. నితిన్ కి మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. ఏకంగా పదిహేను కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఓటీటీకి సినిమా తీసి ఇవ్వడంలో ఇన్ని లాభాలు వస్తాయనే విషయాన్ని గ్రహించిన నితిన్ ఇప్పుడు ఓటీటీ కోసం మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ డైరెక్టర్లను ఓటీటీకి సరిపడా కథ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాడట. సింపుల్ కథను తీసుకొని.. తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ హీరో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఓటీటీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. మరి నితిన్ కి సూటయ్యే కథ దొరుకుతుందేమో చూడాలి!
This post was last modified on November 22, 2021 2:33 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…