లాక్ డౌన్ సమయంలో ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఓటీటీలో దొరుకుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో సినిమాలను తీసి ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఆ విధంగా భారీ లాభాలను పొందుతున్నారు. ఇప్పుడు హీరో నితిన్ కూడా అదే చేస్తున్నాడట. ఇటీవల నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నటించడంతో పాటు తన సొంత బ్యానర్ లో నిర్మించాడు నితిన్. అందుకే థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే ఎలా ప్రమోషన్స్ చేస్తారో.. అదే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించాడు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. నితిన్ కి మాత్రం భారీ లాభాలను తీసుకొచ్చింది. ఏకంగా పదిహేను కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఓటీటీకి సినిమా తీసి ఇవ్వడంలో ఇన్ని లాభాలు వస్తాయనే విషయాన్ని గ్రహించిన నితిన్ ఇప్పుడు ఓటీటీ కోసం మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ డైరెక్టర్లను ఓటీటీకి సరిపడా కథ ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాడట. సింపుల్ కథను తీసుకొని.. తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని నితిన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ హీరో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఓటీటీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. మరి నితిన్ కి సూటయ్యే కథ దొరుకుతుందేమో చూడాలి!
This post was last modified on November 22, 2021 2:33 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…