భీమ్లా నాయక్ సంక్రాంతి రిలీజ్ విషయంలో అనుమానాలు పెట్టుకోవాల్సిన పనేమీ లేనట్లే. దిల్ రాజు అండ్ కో రంగంలోకి దిగినా చిత్ర బృందం తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కనిపించడం లేదు. జనవరి 12న రిలీజ్ పక్కా అని నొక్కి వక్కాణిస్తున్నారు సోషల్ మీడియాలో. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా నిర్ణయం మార్చుకోకూడదని భీమ్లా నాయక్ టీం ముందే నిర్ణయించుకోవడంతో ఆ చిత్రం సంక్రాంతి పోరుకు రెడీ అయిపోయింది.
ఆర్ఆర్ఆర్ విడుదలైన ఐదు రోజులకు, రాధేశ్యామ్ రావడానికి రెండు రోజుల ముందు.. అంటే జనవరి 12నే భీమ్లా నాయక్ థియేటర్లలోకి దిగనుంది. ఇందుకోసం థియేటర్ల బుకింగ్స్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి థియేటర్ల విషయంలో మంచి అండ లభిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇంత పోటీలో వస్తున్నప్పటికీ.. భీమ్లా నాయక్కు బిజినెస్ బాగానే జరుగుతోందట.
రూ.95 కోట్ల దాకా భీమ్లా నాయక్ థియేట్రికల్ హక్కులు పలికినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే థియేట్రికల్ బిజినెస్ ఈజీగా రూ.100 కోట్లు దాటిపోవాలి. కానీ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్లతో పోటీ, పైగా థియేటర్లు తగ్గిపోతుండటం.. దీనికి తోడు ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో సందిగ్ధత.. ఈ కారణాల వల్ల బిజినెస్ మీద ప్రభావం పడింది.
ఇన్ని ప్రతికూలతల మధ్య భీమ్లా నాయక్ రూ.90-95 కోట్ల మధ్య బిజినెస్ చేసిందంటే గొప్ప విషయమే అని చెప్పాలి. ఇందులో నైజాం హక్కులే రూ.40 కోట్ల దాకా పలికినట్లు తెలుస్తోంది. ఆంధ్రా, రాయలసీమలో రేట్లు కొంచెం తగ్గి రూ.60 కోట్లకు పైచిలుకు రేటు వచ్చింది. మామూలుగా చూస్తే రికవరీ ఈజీనే అనిపిస్తున్నప్పటికీ.. ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందన్నదాన్ని బట్టి భీమ్లా నాయక్ బయ్యర్లు సేఫ్ జోన్లోకి రావడం, లాభాల బాట పట్టడం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on November 22, 2021 9:57 am
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…