మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా రాజీ పడి ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో కొందరు హీరోలు చిరు సినిమాకి వారం గ్యాప్ ఇచ్చి తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు ఓ హీరో చిరుతో పోటీకి దిగుతున్నారు. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. గత రెండేళ్లుగా సూర్య నటిస్తోన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సూర్య థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయడం లేదు. తన కొత్త సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని అధికారికంగా ప్రకటించారు సూర్య.
ప్రస్తుతం ఆయన ‘ఇతరుక్కుమ్ తునిందవన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సూర్య సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగు మార్కెట్ లో ఆయన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ హీరో అంత రిస్క్ చేస్తాడా..? లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడో చూడాలి!
This post was last modified on November 19, 2021 5:39 pm
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…