మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా రాజీ పడి ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో కొందరు హీరోలు చిరు సినిమాకి వారం గ్యాప్ ఇచ్చి తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు ఓ హీరో చిరుతో పోటీకి దిగుతున్నారు. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. గత రెండేళ్లుగా సూర్య నటిస్తోన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సూర్య థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయడం లేదు. తన కొత్త సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని అధికారికంగా ప్రకటించారు సూర్య.
ప్రస్తుతం ఆయన ‘ఇతరుక్కుమ్ తునిందవన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సూర్య సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగు మార్కెట్ లో ఆయన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ హీరో అంత రిస్క్ చేస్తాడా..? లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడో చూడాలి!
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…