మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా రాజీ పడి ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో కొందరు హీరోలు చిరు సినిమాకి వారం గ్యాప్ ఇచ్చి తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు ఓ హీరో చిరుతో పోటీకి దిగుతున్నారు. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. గత రెండేళ్లుగా సూర్య నటిస్తోన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సూర్య థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయడం లేదు. తన కొత్త సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని అధికారికంగా ప్రకటించారు సూర్య.
ప్రస్తుతం ఆయన ‘ఇతరుక్కుమ్ తునిందవన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సూర్య సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగు మార్కెట్ లో ఆయన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ హీరో అంత రిస్క్ చేస్తాడా..? లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడో చూడాలి!
This post was last modified on November 19, 2021 5:39 pm
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…