మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా రాజీ పడి ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో కొందరు హీరోలు చిరు సినిమాకి వారం గ్యాప్ ఇచ్చి తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు ఓ హీరో చిరుతో పోటీకి దిగుతున్నారు. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. గత రెండేళ్లుగా సూర్య నటిస్తోన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సూర్య థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయడం లేదు. తన కొత్త సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని అధికారికంగా ప్రకటించారు సూర్య.
ప్రస్తుతం ఆయన ‘ఇతరుక్కుమ్ తునిందవన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సూర్య సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగు మార్కెట్ లో ఆయన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ హీరో అంత రిస్క్ చేస్తాడా..? లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడో చూడాలి!
This post was last modified on November 19, 2021 5:39 pm
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…