‘118’తో చాన్నాళ్ల తర్వత మంచి హిట్ కొట్టి.. ఆ తర్వాత ‘ఎంతమంచి వాడవురా’ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఆ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ అయితే తీసుకున్నాడు కానీ.. ఎగ్జైటింగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు కళ్యాణ్. అతను చడీచప్పుడు లేకుండా ఒక భారీ చిత్రాన్ని మొదలుపెట్టి.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తవుతున్న దశలో దాని గురించి ప్రకటన చేశాడు. ఆ చిత్రమే.. బింబిసార.
కళ్యాణ్ రామ్ చేసిన తొలి పీరియాడిక్ మూవీ ఇది. ఇందులో కొంచెం జానపద ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. మల్లిడి వశిష్ట్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ‘యన్.టి.ఆర్ ఆర్ట్స్లో అతడి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది.
కొన్ని నెలల కిందట ఉన్నట్లుండి ‘బింబిసార’ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ చిత్రం వార్తల్లో లేదు. ఐతే ఈ సినిమాను సైలెంటుగా విడుదలకు సిద్ధం చేస్తున్నారని.. డిసెంబరులోనే ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోందని సమాచారం.
ఈ నెల మొదటి వారంలో బాలయ్య సినిమా ‘అఖండ’ రానుండగా.. క్రిస్మస్ ముందు వారం ‘పుష్ప’ లాంటి భారీ చిత్రం విడుదల కాబోతోంది. క్రిస్మస్ వారాంతంలో ‘శ్యామ్ సింగరాయ్’, ‘గని’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇలాంటి రిస్కీ సినిమాను పండుగ బరిలో నిలిపితే బాగుంటుంది కానీ.. క్రిస్మస్కు ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువైంది. కాబట్టి ‘గని’ వదులుకున్న డిసెంబరు 10వ తేదీ మీద ‘బింబిసార’ పడొచ్చు. అదే రోజు ‘గుడ్ లక్ సఖి’ రానున్నప్పటికీ దాని వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. చూడాలి మరి కళ్యాణ్ రామ్ ఎక్కడ దూరుతాడో?
This post was last modified on November 18, 2021 3:32 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…