‘బాహుబలి’తో ఎవ్వరూ ఊహించని బ్లాక్బస్టర్ డెలివర్ చేశాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. అంతకుముందే మగధీర, ఈగ లాంటి అసాధారణ ప్రయత్నాలు చేసినా.. అవి తెలుగు రాష్ట్రాలను దాటి మిగతా ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదు. కానీ ‘బాహుబలి’తో జక్కన్న ప్రభ ప్రపంచ స్థాయికి విస్తరించింది. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని భారీ విజయాన్నందుకుంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమా మీద అమితాసక్తి నెలకొంది. ఈ సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు కూడా నడిచాయి. చివరికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైన ఆరు నెలల తర్వాత 2017 నవంబరు 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో రాజమౌళి ఈ సస్పెన్సుకు తెరదించాడు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల సంచలన కాంబినేషన్లో రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని తీయబోతున్నాడన్న సమాచారం బయటికి వచ్చింది ఆ డేట్కే. ఆ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో జక్కన్న తన ట్విట్టర్ అకౌంట్లో తారక్, చరణ్లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అంతకుమించి ఏ వ్యాఖ్యా జత చేయలేదు. ముందు ఇదేదో మామూలు ఫొటోనే అనుకున్నారు కానీ.. ఈ కలయికలో ఒక మెగా మల్టీస్టారర్ను జక్కన్న తీయబోతున్నాడని తర్వాతే జనాలకు అర్థమైంది. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర.
కాంబినేషన్ పరంగా మాత్రమే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా.. గత నాలుగేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి ‘బాహుబలి’కి దీటైన క్రేజ్ సంపాదంచుకుంది. బిజినెస్ పరంగా కూడా దాన్ని మించేసింది. ఇంకో 50 రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ కాంబినేషన్ గురించి హింట్ ఇస్తూ తాను షేర్ చేసిన తొలి ఫొటోను రాజమౌళి రీట్వీట్ చేశాడు. ఇది చూసి ఈ నాలుగేళ్ల జర్నీ మొత్తం ప్రేక్షకులకు గుర్తుకు వస్తోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…