కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. డివోర్స్ తరువాత ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘పిట్టకథలు’, ఆహాలో ‘కుడి ఎడమైతే’ వంటి వెబ్ డ్రామాల్లో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమలా.. ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు.
రీసెంట్ గా సీనియర్ హీరో నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వస్తే.. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఆ ప్రాజెక్ట్ కూడా వదులుకుందని సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమాలో ముందుగా కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో అమలాపాల్ ని తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఆమెని సంప్రదిస్తే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆమెకున్న మార్కెట్ ని మించి అడగడంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారట. అమలాపాల్ ఫైనల్ కాకపోవడంతో చాలా మంది తారలను సంప్రదించారు. వారిలో మెహ్రీన్ కూడా ఉందట. ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. సీనియర్ హీరో కాబట్టి అంత ఇవ్వాలసిందేనని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికైతే.. అమలాపాల్, మెహ్రీన్ లను మాత్రం ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.
This post was last modified on November 17, 2021 8:43 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…