కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. డివోర్స్ తరువాత ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘పిట్టకథలు’, ఆహాలో ‘కుడి ఎడమైతే’ వంటి వెబ్ డ్రామాల్లో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమలా.. ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు.
రీసెంట్ గా సీనియర్ హీరో నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వస్తే.. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఆ ప్రాజెక్ట్ కూడా వదులుకుందని సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమాలో ముందుగా కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో అమలాపాల్ ని తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఆమెని సంప్రదిస్తే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆమెకున్న మార్కెట్ ని మించి అడగడంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారట. అమలాపాల్ ఫైనల్ కాకపోవడంతో చాలా మంది తారలను సంప్రదించారు. వారిలో మెహ్రీన్ కూడా ఉందట. ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. సీనియర్ హీరో కాబట్టి అంత ఇవ్వాలసిందేనని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికైతే.. అమలాపాల్, మెహ్రీన్ లను మాత్రం ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.
This post was last modified on November 17, 2021 8:43 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…