కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. డివోర్స్ తరువాత ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘పిట్టకథలు’, ఆహాలో ‘కుడి ఎడమైతే’ వంటి వెబ్ డ్రామాల్లో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమలా.. ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు.
రీసెంట్ గా సీనియర్ హీరో నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వస్తే.. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఆ ప్రాజెక్ట్ కూడా వదులుకుందని సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమాలో ముందుగా కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో అమలాపాల్ ని తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఆమెని సంప్రదిస్తే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆమెకున్న మార్కెట్ ని మించి అడగడంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారట. అమలాపాల్ ఫైనల్ కాకపోవడంతో చాలా మంది తారలను సంప్రదించారు. వారిలో మెహ్రీన్ కూడా ఉందట. ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. సీనియర్ హీరో కాబట్టి అంత ఇవ్వాలసిందేనని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికైతే.. అమలాపాల్, మెహ్రీన్ లను మాత్రం ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.
This post was last modified on November 17, 2021 8:43 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…