కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మించడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ సినిమాలో మెయిన్ పాయింట్ చాలా బాగుందని అందరూ పొగిడారు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. బాలీవుడ్ కి చెందిన మూడు నిర్మాణ సంస్థలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. నిజానికి బాలీవుడ్ లో ఇలాంటి కథలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
చర్చలు జరిపిన తరువాత ఎవరైతే మంచి డీల్ ఆఫర్ చేస్తారో వాళ్లకు రీమేక్ హక్కులు ఇచ్చేస్తారట. ఏ సంస్థకు హక్కులు అమ్మామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో నడుతోంది. దామోదర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గీత్, మేఘన హీరోయిన్లుగా నటించారు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…