కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మించడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ సినిమాలో మెయిన్ పాయింట్ చాలా బాగుందని అందరూ పొగిడారు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. బాలీవుడ్ కి చెందిన మూడు నిర్మాణ సంస్థలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. నిజానికి బాలీవుడ్ లో ఇలాంటి కథలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
చర్చలు జరిపిన తరువాత ఎవరైతే మంచి డీల్ ఆఫర్ చేస్తారో వాళ్లకు రీమేక్ హక్కులు ఇచ్చేస్తారట. ఏ సంస్థకు హక్కులు అమ్మామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో నడుతోంది. దామోదర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గీత్, మేఘన హీరోయిన్లుగా నటించారు.
This post was last modified on November 17, 2021 6:20 pm
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…