Movie News

బాలీవుడ్ లో ‘పుష్పక విమానం’!

కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మించడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ సినిమాలో మెయిన్ పాయింట్ చాలా బాగుందని అందరూ పొగిడారు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. బాలీవుడ్ కి చెందిన మూడు నిర్మాణ సంస్థలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. నిజానికి బాలీవుడ్ లో ఇలాంటి కథలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

చర్చలు జరిపిన తరువాత ఎవరైతే మంచి డీల్ ఆఫర్ చేస్తారో వాళ్లకు రీమేక్ హక్కులు ఇచ్చేస్తారట. ఏ సంస్థకు హక్కులు అమ్మామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో నడుతోంది. దామోదర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గీత్, మేఘన హీరోయిన్లుగా నటించారు.

This post was last modified on November 17, 2021 6:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

56 minutes ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

2 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

3 hours ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

4 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

5 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

5 hours ago