జూనియర్ ఎన్టీఆర్ తన ప్రమేయం లేకుండా ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నారు. ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా తారక్ గురించి చెప్పమని హీరోయిన్ మీరా చోప్రాను అతడి అభిమానులు అడిగితే అతనెవరో తెలియదని ఆమె అన్నందుకు బూతులు తిట్టేశారు. దీనిపై ఆమె చాలా సీరియస్ అయింది. ఎన్టీఆర్ను ట్యాగ్ చేసి మరీ అతడి అతడి అభిమానుల బూతుల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టింది.
దీనిపై పోలీసులతో పాటు ఏపీ సీఎం, తెలంగాణ మంత్రి కేటీఆర్లకూ ఫిర్యాదు చేసింది. అభిమానుల చర్యపై ఆమె తారక్ను నిలదీసిన సంగతీ తెలిసిందే. ఐతే ఈ విషయంలో తారక్ను బాధ్యుడిని చేయడం, అతను వివరణ ఇవ్వాలనడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఐతే దీనిపై తారక్ స్పందించనూ లేడు. అలాగని సైలెంటుగా ఉన్నా సమస్యే. ఈ ఇష్యూలో ఇండస్ట్రీ నుంచి నేరుగా తారక్ తరఫున ఎవరైనా మాట్లాడటమూ కష్టమే. ఐతే ఎవరూ ఊహించని విధంగా తారక్తో ఇంతకుముందు ‘ఊసరవెల్లి’ సినిమాలో చిన్న పాత్ర చేసిన పాయల్ ఘోష్ రంగంలోకి దిగింది. ఆమె ఉన్నట్లుండి అభిమానులతో చిట్ చాట్ చేసింది.
అందులో తారక్ అభిమానులు అతడి గురించి అడిగారు. ఆమె బదులిస్తూ తారక్ మహిళల్ని ఎంతగా గౌరవిస్తాడో చెప్పుకొచ్చింది. ఊసరవెల్లి షూటింగ్ టైంలో తాను రోడ్డు పక్కన టెంటులో బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే అతనెంతగా పీలైంది వివరించింది. తారక్కు మహిళలంటే గౌరవం, మహిళలంటే గౌరవం అంటూ ఆమె నొక్కి వక్కాణిస్తూ వివరంగా ట్వీట్లు వేసింది. అతడి వ్యక్తిత్వాన్ని పొగిడింది. అలాగే ఉత్తరాదిన అతడి ఫాలోయింగ్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి అడగని విషయాలకు కూడా ఆమె సమాధానం చెప్పి ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి మీరా ఎపిసోడ్లో దెబ్బ తిన్న తారక్ అభిమానులకు పాయల్ ఇలా మాట్లాడటం ఊరటనిచ్చే విషయమే. అందుకే ఆమె ట్వీట్లను పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు.
This post was last modified on June 6, 2020 10:49 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…