Movie News

వంద కోట్లతో వైఆర్‌‌ఎఫ్‌ వెబ్ సిరీస్‌

బాలీవుడ్‌లో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌‌కి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంస్థ అది. యశ్‌ చోప్రా తీసిన అద్భుతమైన సినిమాలు ఆ బ్యానర్‌‌ని తిరుగులేని స్థాయికి చేర్చాయి. ఆ లెగసీని ఆయన కొడుకు ఆదిత్య చోప్రా కొనసాగిస్తున్నారు. తమ సంస్థను మరో లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటిలో వైఆర్‌‌ఎఫ్‌ ఓటీటీ ఒకటి.

కరోనా వచ్చాక థియేటర్లు మూతబడ్డాయి. దాంతో ఓటీటీలు జెండా ఎగరేశాయి. సినిమాల పరిశ్రమ స్తంభించిపోయినా ప్రేక్షకుడు ఎంటర్‌‌టైన్‌మెంట్ మిస్ కాలేదంటే దానికి కారణం ఓటీటీలే. వాటి ప్రాధాన్యతను గుర్తించడం వల్లే అల్లు అరవింద్ లాంటి టాప్‌ నిర్మాత తెలుగులో ఆహాను నెలకొల్పారు. ఇప్పుడు ఆదిత్య చోప్రా కూడా అదే ప్లాన్స్‌లో ఉన్నారు. అయితే ఆయన ప్రణాళికలు కాస్త షాకింగ్‌గానే ఉన్నాయి.

వైఆర్‌‌ఎఫ్ ఓటీటీని ఐదొందల కోట్ల పెట్టుబడితో మొదలుపెడుతున్నారు ఆదిత్య. మొట్టమొదటి ప్రాజెక్ట్‌ను చాలా ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్‌ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకున్నారట. ఆదిత్య భార్య రాణీముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘మర్దానీ 2’ని డైరెక్ట్‌ చేసిన గోపీ పుత్రన్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్‌ కోసం వంద కోట్లు పెడుతున్నారట ఆదిత్య.

భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో నలుగురు ఫేమస్ బాలీవుడ్ హీరోలు నటిస్తారట. వారిలో ఒకరు కచ్చితంగా స్టార్ హీరోనే అయ్యుండాలని ఆదిత్య అనుకుంటున్నారట. రాణీ ముఖర్జీ కూడా ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఎంట్రీ ఇస్తుందని టాక్. డిసెంబర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇవన్నీ చూస్తుంటే ఆదిత్య ఓటీటీని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిజిటల్ ప్రపంచంలో ఇదో సంచలనం అవుతుంది.

This post was last modified on November 17, 2021 4:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

6 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

6 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

7 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

7 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

9 hours ago