సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్ల కింద చెప్పిన మాటలు చూస్తే ఈపాటికి ఆయన ఎప్పుడో సినిమాలు మానేసి ఉండాలి. తాను రాజకీయ పార్టీ పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగబోతున్నట్లు ఆయన మూణ్నాలుగేళ్ల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే.
70 ఏళ్లకు చేరువ అవుతూ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఇక సినిమాలకు టాటా చెప్పేయబోతున్నట్లే అని అంతా అనుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టే విషయంలో ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోయింది. ఆ గ్యాప్లో చకచకా సినిమాలు లాగించేశారు.
చివరికేమో ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. కరోనా ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. చివరికి సినిమాల విషయంలోనూ రజినీ అంత ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది.
కరోనాకు ముందు మొదలుపెట్టిన ‘అన్నాత్తె’ సినిమాను అతి కష్టం మీద పూర్తి చేసిన రజినీ.. దీని తర్వాత సినిమాల్లో నటించడం పట్ల ఏమంత ఆసక్తిగా లేనట్లే కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో రజినీ తీరు గమనిస్తే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోటి ప్రకటించాడు.
కానీ ‘అన్నాత్తె’ చేస్తుండగా మాత్రం కొత్త సినిమా ఊసు ఎత్తలేదు. రాజకీయాల్లోకి వస్తే ‘అన్నాత్తె’నే సినిమా అవుతుందనుకున్నారు కానీ.. పొలిటికల్ ఎంట్రీ రద్దు చేసుకున్నా సరే ఆయనకు ఇదే చివరి సినిమాలా కనిపిస్తోంది. వయసు ప్రభావానికి తోడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో రజినీకి సినిమాలు చేసే ఓపిక తగ్గిపోయినట్లే కనిపిస్తోంది.
‘పేట’ తర్వాత రజినీతో కార్తీక్ సుబ్బరాజ్ ఇంకో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. అది కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ‘అన్నాత్తె’ సినిమా హిట్ అంటూ రజినీ పొంగిపోతుండొచ్చు కానీ.. ఈ సినిమా చూసి అభిమానులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వరుసగా పేలవమైన సినిమాలే చేస్తుండటంతో ఈ వయసులో, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఇంత కష్టపడి ఇలాంటి సినిమాలు చేయడం కన్నా ఆయన సినిమాలు మానేస్తే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రజినీ తీరు చూస్తుంటే ఆయనా ఆ నిర్ణయమే తీసుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on November 17, 2021 12:28 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…