అక్కినేని ఫ్యామిలీ ఘన వారసత్వంతో రెండు దశాబ్దాల కిందట మంచి అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమంత్. తొలి సినిమాలో చూస్తే సుమంత్ ప్రామిసింగ్గా అనిపించాడు కానీ.. ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో కెరీర్ ఆరంభంలోనే బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. అలాంటి టైంలో సత్యం సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాడు. ఈ సినిమా సుమంత్కు నటుడిగా పేరు తెచ్చింది. అలాగే మంచి విజయాన్నీ అందించింది. కానీ తర్వాత కూడా సుమంత్ కెరీర్లో ఒడుదొడుకులు తప్పలేదు.
గోదావరి, మళ్ళీ రావా.. ఇలా ఎప్పుడో ఒకసారి ఓ హిట్టు కొట్టడమే తప్ప నిలకడగా ఎప్పుడూ విజయాలు సాధించలేదు సుమంత్. కొన్నేళ్ల కిందట మళ్ళీ రావాతో గాడిన పడ్డట్లే కనిపించినా.. మళ్లీ వరుస పరాజయాలతో మార్కెట్ మొత్తం దెబ్బ తీసుకున్నాడు.
ఐతే ఎన్ని సినిమాలు నిరాశ పరిచినా సుమంత్కు సినిమాలు మాత్రం ఆగట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు లైన్లో పెడుతూనే ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి రిలీజవుతూనే ఉన్నాయి. చివరగా ఈ ఏడాది సుమంత్ నుంచి వచ్చిన కపటధారి డిజాస్టర్ కావడం తెలిసిందే. దీని తర్వాత అతను మళ్ళీ మొదలైంది అనే ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీ చేశాడు. అలాగే దీనికి భిన్నంగా అనగనగా ఒక రౌడీ అంటూ మాస్ ఫిలిం చేశాడు. అవి రెండూ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇంతలోనే సుమంత్ కొత్త సినిమా ఒకటి లైన్లోకి వచ్చింది. అదే.. అహం-రీబూట్. ఇదొక కొత్త తరహా థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోంది. ప్రశాంత్ సాగర్ అట్లూరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సోమవారమే సినిమాను ప్రకటించారు. ఇదే రోజు ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు కొత్త జానర్లలో సుమంత్ సినిమాలు సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ.. అతను కోరుకున్న విజయాలే దక్కట్లేదు. అహం-రీబూట్ అయినా అతడికి మంచి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
This post was last modified on November 16, 2021 10:07 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…