అందం, టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం మాత్రం అంతంతమాత్రమే ఈషా రెబ్బకి. ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలూ అంతగా రావడం లేదు. దాంతో వెబ్ సిరీసుల వైపు అడుగేసింది. రీసెంట్గా మారుతి ‘త్రీరోజెస్’లో ఒక బోల్డ్ బేబీగా కనిపించింది మురిపించింది. ఇప్పుడు ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో ‘ధమాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. దాన్ని మొదట అనసూయతో చేయించాలనుకున్నారు. కానీ ఆమె ఆల్రెడీ ‘ఖిలాడి’లో ఓ కీలక పాత్ర చేసింది. దాంతో ఈ కాంబో పెద్ద కిక్కివ్వదని మేకర్స్ అనుకున్నారట.
ఆ తర్వాత పాయల్ రాజ్పుత్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె కూడా ఇప్పటికే ‘డిస్కో రాజా’ మూవీలో మాస్ మహారాజాతో జోడీ కట్టింది. వారి పెయిర్కి పెద్దగా పేరు రాలేదు. కాబట్టి మరోసారి రిపీట్ చేయడం అనవసరం అనిపించి ఆ ఆలోచనను కూడా మార్చుకున్నారట. చివరికి ఈషా రెబ్బా అయితే బాగుంటుందని, ఇప్పటి వరకు ఆమె ఐటమ్ సాంగ్ చేయలేదు కాబట్టి ఫ్రెష్ ఫీల్ వస్తుందని ఫీలవుతున్నారట. దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే అంటున్నారు.
అచ్చ తెలుగు అమ్మాయే అయినా అందాల విందు చేయడానికి ఎప్పుడూ సంకోచించదు ఈషా. సినిమాల్లో డీసెంట్ రోల్సే చేసినా వెబ్ సిరీసుల్లో హాట్ హాట్గా అదరగొడుతోంది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచి నెటిజన్స్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం వస్తే తన బెస్ట్ ఇవ్వడానికి కచ్చితంగా ట్రై చేస్తుంది. సో ఆమెకి ఆఫర్ చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఇంతవరకు ఏదీ అచ్చిరాని ఈషాకి ఈ అవకాశమైనా హెల్పవుతుందో లేదో చూడాలి.
This post was last modified on November 15, 2021 11:28 am
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…