అందం, టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం మాత్రం అంతంతమాత్రమే ఈషా రెబ్బకి. ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలూ అంతగా రావడం లేదు. దాంతో వెబ్ సిరీసుల వైపు అడుగేసింది. రీసెంట్గా మారుతి ‘త్రీరోజెస్’లో ఒక బోల్డ్ బేబీగా కనిపించింది మురిపించింది. ఇప్పుడు ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో ‘ధమాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. దాన్ని మొదట అనసూయతో చేయించాలనుకున్నారు. కానీ ఆమె ఆల్రెడీ ‘ఖిలాడి’లో ఓ కీలక పాత్ర చేసింది. దాంతో ఈ కాంబో పెద్ద కిక్కివ్వదని మేకర్స్ అనుకున్నారట.
ఆ తర్వాత పాయల్ రాజ్పుత్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె కూడా ఇప్పటికే ‘డిస్కో రాజా’ మూవీలో మాస్ మహారాజాతో జోడీ కట్టింది. వారి పెయిర్కి పెద్దగా పేరు రాలేదు. కాబట్టి మరోసారి రిపీట్ చేయడం అనవసరం అనిపించి ఆ ఆలోచనను కూడా మార్చుకున్నారట. చివరికి ఈషా రెబ్బా అయితే బాగుంటుందని, ఇప్పటి వరకు ఆమె ఐటమ్ సాంగ్ చేయలేదు కాబట్టి ఫ్రెష్ ఫీల్ వస్తుందని ఫీలవుతున్నారట. దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే అంటున్నారు.
అచ్చ తెలుగు అమ్మాయే అయినా అందాల విందు చేయడానికి ఎప్పుడూ సంకోచించదు ఈషా. సినిమాల్లో డీసెంట్ రోల్సే చేసినా వెబ్ సిరీసుల్లో హాట్ హాట్గా అదరగొడుతోంది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచి నెటిజన్స్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం వస్తే తన బెస్ట్ ఇవ్వడానికి కచ్చితంగా ట్రై చేస్తుంది. సో ఆమెకి ఆఫర్ చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఇంతవరకు ఏదీ అచ్చిరాని ఈషాకి ఈ అవకాశమైనా హెల్పవుతుందో లేదో చూడాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…