‘లెజెండ్’ సినిమా రావడానికి ముందు జగపతిబాబు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. హీరోగా అవకాశాలు తగ్గిపోయి.. క్యారెక్టర్ రోల్స్ కూడా సరైనవి పడక.. డబ్బుకోసం చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ జనాల ఆలోచనల్లోంచే వెళ్లిపోయే స్థితిలో ఉన్నారాయన. అలాంటి ఆయనకి ‘లెజెండ్’ సినిమాలో విలన్గా జితేంద్ర అనే పాత్ర ఇచ్చి తన కెరీర్ మలుపు తిరిగేలా చేశాడు బోయపాటి శ్రీను.
బాలయ్యకు విలన్గా జగపతిబాబు అనగానే ఈ పాత్రపై, సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్లే అన్నీ ఉండటంతో జగపతిబాబు సినిమాకు హైలైట్ అయ్యాడు. దర్శక నిర్మాతలు ఆయన వెంట పడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగినప్పటికీ కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా ఆయనకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు బోయపాటి నుంచి తన కెరీర్కూ అలాంటి మలుపే ఆశిస్తున్నాడు శ్రీకాంత్.
బాలయ్య-బోయపాటి కలయికలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం ఇంతకుముందే వెల్లడైంది. ఐతే ఆయన పాత్ర గురించి ఎలాంటి హింట్ లేదు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో శ్రీకాంత్ భయంకరమైన లుక్లో కనిపించాడు. ఒక సీన్లో అతను చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. చూస్తుంటే ఈ పాత్ర చాలా వయొలెంట్గా ఉండేలాగే ఉంది. బాలయ్యతో దీటుగా తలపడేలాగే కనిపిస్తున్నాడు శ్రీకాంత్.
హీరో కావడానికి ముందే నెగెటివ్ రోల్స్తో ఆకట్టుకున్న శ్రీకాంత్.. లీడ్ రోల్స్లో సక్సెస్ అయ్యాక ఫ్యామిలీ సినిమాల హీరో అయిపోయాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే రఫ్ క్యారెక్టర్లు చేశాడు. ఐతే హీరోగా అవకాశాలు తగ్గిపోయాక కొన్నేళ్ల కిందట ‘యుద్ధం శరణం’ మూవీతో విలన్గా రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. ఆ సినిమా ఆడలేదు. విలన్గా బ్రేక్ రాలేదు. కెరీర్ నామమాత్రంగా నడుస్తోంది. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్లీ ‘అఖండ’తో విలన్ అవతారం ఎత్తాడు శ్రీకాంత్. మరి ‘లెజెండ్’లో జగపతిలాగే శ్రీకాంత్ సైతం బోయపాటి ద్వారా బ్రేక్ అందుకుని బిజీ అయిపోతాడేమో చూడాలి.
This post was last modified on November 15, 2021 10:44 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…