‘లెజెండ్’ సినిమా రావడానికి ముందు జగపతిబాబు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. హీరోగా అవకాశాలు తగ్గిపోయి.. క్యారెక్టర్ రోల్స్ కూడా సరైనవి పడక.. డబ్బుకోసం చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ జనాల ఆలోచనల్లోంచే వెళ్లిపోయే స్థితిలో ఉన్నారాయన. అలాంటి ఆయనకి ‘లెజెండ్’ సినిమాలో విలన్గా జితేంద్ర అనే పాత్ర ఇచ్చి తన కెరీర్ మలుపు తిరిగేలా చేశాడు బోయపాటి శ్రీను.
బాలయ్యకు విలన్గా జగపతిబాబు అనగానే ఈ పాత్రపై, సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్లే అన్నీ ఉండటంతో జగపతిబాబు సినిమాకు హైలైట్ అయ్యాడు. దర్శక నిర్మాతలు ఆయన వెంట పడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగినప్పటికీ కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా ఆయనకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు బోయపాటి నుంచి తన కెరీర్కూ అలాంటి మలుపే ఆశిస్తున్నాడు శ్రీకాంత్.
బాలయ్య-బోయపాటి కలయికలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం ఇంతకుముందే వెల్లడైంది. ఐతే ఆయన పాత్ర గురించి ఎలాంటి హింట్ లేదు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో శ్రీకాంత్ భయంకరమైన లుక్లో కనిపించాడు. ఒక సీన్లో అతను చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. చూస్తుంటే ఈ పాత్ర చాలా వయొలెంట్గా ఉండేలాగే ఉంది. బాలయ్యతో దీటుగా తలపడేలాగే కనిపిస్తున్నాడు శ్రీకాంత్.
హీరో కావడానికి ముందే నెగెటివ్ రోల్స్తో ఆకట్టుకున్న శ్రీకాంత్.. లీడ్ రోల్స్లో సక్సెస్ అయ్యాక ఫ్యామిలీ సినిమాల హీరో అయిపోయాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే రఫ్ క్యారెక్టర్లు చేశాడు. ఐతే హీరోగా అవకాశాలు తగ్గిపోయాక కొన్నేళ్ల కిందట ‘యుద్ధం శరణం’ మూవీతో విలన్గా రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. ఆ సినిమా ఆడలేదు. విలన్గా బ్రేక్ రాలేదు. కెరీర్ నామమాత్రంగా నడుస్తోంది. ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్లీ ‘అఖండ’తో విలన్ అవతారం ఎత్తాడు శ్రీకాంత్. మరి ‘లెజెండ్’లో జగపతిలాగే శ్రీకాంత్ సైతం బోయపాటి ద్వారా బ్రేక్ అందుకుని బిజీ అయిపోతాడేమో చూడాలి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…