ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులతో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్పాశెట్టి, రాజ్కుంద్రా మొదలుపెట్టిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇందులో భాగంగా తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలను తీసుకున్నారని.. డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు శిల్పాశెట్టి, రాజ్కుంద్రాలపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు.
అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు రాజ్కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 19 నుంచి అతడిని కష్టడీలోనే ఉంచారు. పలుమార్లు బెయిల్ కి అప్లై చేసుకున్నా.. రిజెక్ట్ అయింది. ఫైనల్ గా ముంబై కోర్టు రీసెంట్ గా బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. రాజ్కుంద్రా నేరం చేసినట్లు రుజువైతే గనుక అతడికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 14, 2021 3:02 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…