ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులతో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్పాశెట్టి, రాజ్కుంద్రా మొదలుపెట్టిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇందులో భాగంగా తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలను తీసుకున్నారని.. డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు శిల్పాశెట్టి, రాజ్కుంద్రాలపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు.
అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు రాజ్కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 19 నుంచి అతడిని కష్టడీలోనే ఉంచారు. పలుమార్లు బెయిల్ కి అప్లై చేసుకున్నా.. రిజెక్ట్ అయింది. ఫైనల్ గా ముంబై కోర్టు రీసెంట్ గా బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. రాజ్కుంద్రా నేరం చేసినట్లు రుజువైతే గనుక అతడికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 14, 2021 3:02 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…