ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులతో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్పాశెట్టి, రాజ్కుంద్రా మొదలుపెట్టిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇందులో భాగంగా తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలను తీసుకున్నారని.. డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు శిల్పాశెట్టి, రాజ్కుంద్రాలపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు.
అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు రాజ్కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 19 నుంచి అతడిని కష్టడీలోనే ఉంచారు. పలుమార్లు బెయిల్ కి అప్లై చేసుకున్నా.. రిజెక్ట్ అయింది. ఫైనల్ గా ముంబై కోర్టు రీసెంట్ గా బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. రాజ్కుంద్రా నేరం చేసినట్లు రుజువైతే గనుక అతడికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 14, 2021 3:02 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…