రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లలో చాలామది బోల్డ్గా మారిపోతారు. ఎవరేమనుకుంటారన్న పట్టింపు లేకుండా తమకు ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. ఇండస్ట్రీలో చాలామంది చూపించే లౌక్యం వర్మ శిష్యుల దగ్గర కనిపించదు. కౌంటర్లు, సెటైర్లు, బోల్డ్ కామెంట్లకు వర్మ శిష్యులు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంటారు.
అజయ్ భూపతి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అతను ఔట్ స్పోకెన్ అనే విషయం ఇంతకుముందే చాలాసార్లు చూశాం. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అజయ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువై కొన్నిసార్లు బోల్డ్ కామెంట్లు చేశాడు.
తన రెండో సినిమా ‘మహాసముద్రం’ కథను తిరస్కరించిన ఒక హీరో మీద చేసిన కామెంట్ కూడా అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు రిగ్రెట్ అయ్యేలా చేస్తానని సన్నిహితుల దగ్గర అజయ్ చాలా ధీమాగా మాట్లాడినట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి.
‘మహాసముద్రం’ గురించి రిలీజ్ ముంగిట అజయ్ మాట్లాడిన మాటలు చూస్తే.. అతడి ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమని, ఈ సినిమాను వదులుకున్న వాళ్లు పశ్చాత్తాపం చెందుతారని అనిపించింది. ఈ సినిమా తర్వాత కచ్చితంగా అజయ్ వెంట చాలామంది హీరోలు పడేలా చేసుకుంటాడన్న అంచనాలు కూడా కలిగాయి. కానీ ‘మహాసముద్రం’ థియేటర్లలోకి దిగాక కథ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అజయ్తో సినిమా అంటే హీరోలు భయపడే పరిస్థితి తలెత్తింది.
నిర్మాతలు కూడా వెనుకంజ వేస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ సక్సెస్ చూసి ఫిదా అయిపోయి ‘మహాసముద్రం’ విషయంలో అజయ్కు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి అతను కోరిన వనరులన్నీ సమకూర్చి పెట్టిన అజయ్ సుంకర.. ఈ సినిమా వల్ల చాలా నష్టపోయాడు. అజయ్ సక్సెస్ మీద ఉన్నపుడే హీరోలు అతడి కథను తిరస్కరించారు. ఇప్పుడు అతను పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఈ స్థితిలో హీరోను, నిర్మాతను సెట్ చేసుకుని మూడో సినిమాను పట్టాలెక్కించడానికి అజయ్ చాలానే కష్టపడాల్సి వచ్చేలా ఉంది.
This post was last modified on November 13, 2021 10:49 pm
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…