నందమూరి బాలకృష్ణను ఒక టాక్ షోలో హోస్ట్గా చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందులోనూ అది అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా కోసం అయ్యుంటుందని అసలే అంచనా వేసి ఉండరు. కానీ ఈ అనుకోని కలయిక సాధ్యమైంది. ‘అన్స్టాపబుల్’ పేరుతో బాలయ్య చేస్తున్న టాక్ షో దీపావళికే మొదలైంది. మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఈ ఎపిసోడ్కు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ షో వల్ల ‘ఆహా’ సబ్స్క్రైబర్లు చెప్పకోదగ్గ సంఖ్యలోనే పెరిగినట్లుగా తెలుస్తోంది. వ్యూయర్ షిప్ ఒక రేంజ్లో ఉందంటున్నారు. తొలి సీజన్ అంతా క్రేజీ గెస్టులతో చాలా హుషారుగా ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మూడో ఎపిసోడ్ గెస్ట్ కూడా ఖరారయ్యారు. ఆ గెస్ట్ కూడా చాలా స్పెషలే.
యూత్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. అన్స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో సందడి చేయబోతున్నాడట. బాలయ్యతో విజయ్కి మంచి అనుబంధమే ఉంది. బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలయ్య.. ‘లైగర్’ సెట్స్కు వెళ్లాడు కూడా.
విజయ్ ఏ వేడుకలో పాల్గొన్నా.. ఏ షోలో అడుగు పెట్టినా అక్కడి వాతావరణాన్నే మార్చేస్తాడు. తనదైన వ్యాఖ్యలతో, చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. అలాంటివాడు బాలయ్య షోలో పాల్గొంటే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. బయట మామూలుగా మాట్లాడేటపుడు బాగా తడబడే బాలయ్య ‘అన్స్టాపబుల్’ షోలో మాత్రం ఏ తడబాటు లేకుండా సాగిపోతున్నాడు. హుషారుగా షోను నడిపిస్తున్నాడు.
ఇందులో ఓ కొత్త బాలయ్య కనిపిస్తున్నాడు అభిమానులకు. తొలి రెండు ఎపిసోడ్లలో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య.. విజయ్తో కలిసి సందడి చేస్తే ఆ ఎపిసోడ్కు రెస్పాన్స్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…