నందమూరి బాలకృష్ణను ఒక టాక్ షోలో హోస్ట్గా చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందులోనూ అది అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా కోసం అయ్యుంటుందని అసలే అంచనా వేసి ఉండరు. కానీ ఈ అనుకోని కలయిక సాధ్యమైంది. ‘అన్స్టాపబుల్’ పేరుతో బాలయ్య చేస్తున్న టాక్ షో దీపావళికే మొదలైంది. మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఈ ఎపిసోడ్కు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ షో వల్ల ‘ఆహా’ సబ్స్క్రైబర్లు చెప్పకోదగ్గ సంఖ్యలోనే పెరిగినట్లుగా తెలుస్తోంది. వ్యూయర్ షిప్ ఒక రేంజ్లో ఉందంటున్నారు. తొలి సీజన్ అంతా క్రేజీ గెస్టులతో చాలా హుషారుగా ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మూడో ఎపిసోడ్ గెస్ట్ కూడా ఖరారయ్యారు. ఆ గెస్ట్ కూడా చాలా స్పెషలే.
యూత్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. అన్స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో సందడి చేయబోతున్నాడట. బాలయ్యతో విజయ్కి మంచి అనుబంధమే ఉంది. బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలయ్య.. ‘లైగర్’ సెట్స్కు వెళ్లాడు కూడా.
విజయ్ ఏ వేడుకలో పాల్గొన్నా.. ఏ షోలో అడుగు పెట్టినా అక్కడి వాతావరణాన్నే మార్చేస్తాడు. తనదైన వ్యాఖ్యలతో, చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. అలాంటివాడు బాలయ్య షోలో పాల్గొంటే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. బయట మామూలుగా మాట్లాడేటపుడు బాగా తడబడే బాలయ్య ‘అన్స్టాపబుల్’ షోలో మాత్రం ఏ తడబాటు లేకుండా సాగిపోతున్నాడు. హుషారుగా షోను నడిపిస్తున్నాడు.
ఇందులో ఓ కొత్త బాలయ్య కనిపిస్తున్నాడు అభిమానులకు. తొలి రెండు ఎపిసోడ్లలో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య.. విజయ్తో కలిసి సందడి చేస్తే ఆ ఎపిసోడ్కు రెస్పాన్స్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 13, 2021 2:11 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…