‘సైరా’లో మెగాస్టార్తో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి ఆయన సరసన మెరిసే చాన్స్ కొట్టేసింది. మెహెర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’లో తనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తమన్నాని ఆకాశానికి ఎత్తేశాడు మెహెర్.
‘కథ చెప్పేటప్పుడే మా సినిమాలో హీరోయిన్ తమన్నాయే అని అందరికీ చెప్పేశాను. ఇప్పుడు తను చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. అయినా కూడా మా సినిమాకి ఎలాగైనా డేట్స్ ఇవ్వమని అడిగాను. అవసరమైతే ఆమె చేస్తున్న ప్రాజెక్టుల ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లి నేనే రిక్వెస్ట్ చేస్తానని కూడా చెప్పాడు. చివరికి ఓకే అంది. తమన్నా ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఓ రేంజ్లో చెప్పుకొచ్చాడు మెహెర్. ఆయన మాటలు విన్నవాళ్లకి కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది.
‘బాహుబలి’ తర్వాత స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి తమన్నాకి. ఎఫ్3, సైరా తప్ప మిగతావన్నీ ఓ మాదిరి సినిమాలే. పైగా వాటిలో ఎక్కువ ఫెయిల్యూర్సే. కాకపోతే వరుసగా ఏదో ఒక సినిమా అయితే చేస్తూ వచ్చింది. అలా అని డేట్స్ దొరకనంత బిజీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. హిందీలో ‘బోలె చూడియా’ అనే సినిమాకి కమిటయ్యింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైపోయింది. ప్రస్తుతం అక్కడ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ ఒక్కటే చేస్తోంది.
ఇక తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. తను కమిటైన ఒకే ఒక్క టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా ఈమధ్యనే చేజారిపోయింది. కాబట్టి చిరంజీవి సినిమాకి డేట్స్ ఇవ్వలేనంత బిజీయేమీ కాదామె. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి సినిమా తన బ్యాగ్లో పడటం అదృష్టమనే చెప్పాలి. మరి తమన్నా డేట్స్ కోసం అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఏంటో.
This post was last modified on November 12, 2021 7:08 am
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…