‘సైరా’లో మెగాస్టార్తో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి ఆయన సరసన మెరిసే చాన్స్ కొట్టేసింది. మెహెర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’లో తనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తమన్నాని ఆకాశానికి ఎత్తేశాడు మెహెర్.
‘కథ చెప్పేటప్పుడే మా సినిమాలో హీరోయిన్ తమన్నాయే అని అందరికీ చెప్పేశాను. ఇప్పుడు తను చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. అయినా కూడా మా సినిమాకి ఎలాగైనా డేట్స్ ఇవ్వమని అడిగాను. అవసరమైతే ఆమె చేస్తున్న ప్రాజెక్టుల ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లి నేనే రిక్వెస్ట్ చేస్తానని కూడా చెప్పాడు. చివరికి ఓకే అంది. తమన్నా ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఓ రేంజ్లో చెప్పుకొచ్చాడు మెహెర్. ఆయన మాటలు విన్నవాళ్లకి కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది.
‘బాహుబలి’ తర్వాత స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి తమన్నాకి. ఎఫ్3, సైరా తప్ప మిగతావన్నీ ఓ మాదిరి సినిమాలే. పైగా వాటిలో ఎక్కువ ఫెయిల్యూర్సే. కాకపోతే వరుసగా ఏదో ఒక సినిమా అయితే చేస్తూ వచ్చింది. అలా అని డేట్స్ దొరకనంత బిజీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. హిందీలో ‘బోలె చూడియా’ అనే సినిమాకి కమిటయ్యింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైపోయింది. ప్రస్తుతం అక్కడ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ ఒక్కటే చేస్తోంది.
ఇక తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. తను కమిటైన ఒకే ఒక్క టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా ఈమధ్యనే చేజారిపోయింది. కాబట్టి చిరంజీవి సినిమాకి డేట్స్ ఇవ్వలేనంత బిజీయేమీ కాదామె. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి సినిమా తన బ్యాగ్లో పడటం అదృష్టమనే చెప్పాలి. మరి తమన్నా డేట్స్ కోసం అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఏంటో.
This post was last modified on November 12, 2021 7:08 am
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…