‘సైరా’లో మెగాస్టార్తో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి ఆయన సరసన మెరిసే చాన్స్ కొట్టేసింది. మెహెర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’లో తనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తమన్నాని ఆకాశానికి ఎత్తేశాడు మెహెర్.
‘కథ చెప్పేటప్పుడే మా సినిమాలో హీరోయిన్ తమన్నాయే అని అందరికీ చెప్పేశాను. ఇప్పుడు తను చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. అయినా కూడా మా సినిమాకి ఎలాగైనా డేట్స్ ఇవ్వమని అడిగాను. అవసరమైతే ఆమె చేస్తున్న ప్రాజెక్టుల ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లి నేనే రిక్వెస్ట్ చేస్తానని కూడా చెప్పాడు. చివరికి ఓకే అంది. తమన్నా ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఓ రేంజ్లో చెప్పుకొచ్చాడు మెహెర్. ఆయన మాటలు విన్నవాళ్లకి కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది.
‘బాహుబలి’ తర్వాత స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి తమన్నాకి. ఎఫ్3, సైరా తప్ప మిగతావన్నీ ఓ మాదిరి సినిమాలే. పైగా వాటిలో ఎక్కువ ఫెయిల్యూర్సే. కాకపోతే వరుసగా ఏదో ఒక సినిమా అయితే చేస్తూ వచ్చింది. అలా అని డేట్స్ దొరకనంత బిజీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. హిందీలో ‘బోలె చూడియా’ అనే సినిమాకి కమిటయ్యింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైపోయింది. ప్రస్తుతం అక్కడ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ ఒక్కటే చేస్తోంది.
ఇక తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. తను కమిటైన ఒకే ఒక్క టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా ఈమధ్యనే చేజారిపోయింది. కాబట్టి చిరంజీవి సినిమాకి డేట్స్ ఇవ్వలేనంత బిజీయేమీ కాదామె. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి సినిమా తన బ్యాగ్లో పడటం అదృష్టమనే చెప్పాలి. మరి తమన్నా డేట్స్ కోసం అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఏంటో.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…