‘సైరా’లో మెగాస్టార్తో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి ఆయన సరసన మెరిసే చాన్స్ కొట్టేసింది. మెహెర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’లో తనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తమన్నాని ఆకాశానికి ఎత్తేశాడు మెహెర్.
‘కథ చెప్పేటప్పుడే మా సినిమాలో హీరోయిన్ తమన్నాయే అని అందరికీ చెప్పేశాను. ఇప్పుడు తను చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. అయినా కూడా మా సినిమాకి ఎలాగైనా డేట్స్ ఇవ్వమని అడిగాను. అవసరమైతే ఆమె చేస్తున్న ప్రాజెక్టుల ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లి నేనే రిక్వెస్ట్ చేస్తానని కూడా చెప్పాడు. చివరికి ఓకే అంది. తమన్నా ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఓ రేంజ్లో చెప్పుకొచ్చాడు మెహెర్. ఆయన మాటలు విన్నవాళ్లకి కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది.
‘బాహుబలి’ తర్వాత స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి తమన్నాకి. ఎఫ్3, సైరా తప్ప మిగతావన్నీ ఓ మాదిరి సినిమాలే. పైగా వాటిలో ఎక్కువ ఫెయిల్యూర్సే. కాకపోతే వరుసగా ఏదో ఒక సినిమా అయితే చేస్తూ వచ్చింది. అలా అని డేట్స్ దొరకనంత బిజీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. హిందీలో ‘బోలె చూడియా’ అనే సినిమాకి కమిటయ్యింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైపోయింది. ప్రస్తుతం అక్కడ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ ఒక్కటే చేస్తోంది.
ఇక తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. తను కమిటైన ఒకే ఒక్క టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా ఈమధ్యనే చేజారిపోయింది. కాబట్టి చిరంజీవి సినిమాకి డేట్స్ ఇవ్వలేనంత బిజీయేమీ కాదామె. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి సినిమా తన బ్యాగ్లో పడటం అదృష్టమనే చెప్పాలి. మరి తమన్నా డేట్స్ కోసం అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఏంటో.
This post was last modified on November 12, 2021 7:08 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…