దక్షిణాది సినిమా స్థాయిని పెంచిన నటుల్లో ముందు కమల్ హాసన్ పేరు చెప్పుకోవాలి. ఇక దర్శకుల్లో అలాంటి ఒక స్థాయిని ఏర్పరుచుకున్న వాడు శంకర్. ఈ ఇద్దరితోనూ వేర్వేరుగా సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్ ఆశిస్తుంది. కానీ వీళ్లిద్దరితో ఒకేసారి సినిమా చేసే అరుదైన అవకాశం అందుకుంది కాజల్ అగర్వాల్. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అందులోనూ కెరీర్ చరమాంకంలో ఇలాంటి అవకాశం వచ్చినందుకు కాజల్ ఎంత సంబరపడిందో. కానీ ఆ సంబరం ఇప్పుడు నైరాశ్యంగా మారేలా కనిపిస్తోంది.
ఆమె కమల్ హాసన్-శంకర్ల కలయికలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయ్యాక వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా కోసం కాజల్ మీద చాలా సన్నివేశాలే తీశారు. కానీ క్రేన్ ప్రమాదం వల్ల దాదాపు రెండేళ్ల కిందట ఆగిన సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. ఇందుకు కారణాలు అనేకం.
తన డేట్లన్నీ వృథా అయినప్పటికీ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రతిష్ఠాత్మకం కావడంతో సినిమా ఎప్పుడు పున:ప్రారంభం అవుతుందా అని ఓపిగ్గా ఎదురు చూసింది కాజల్. కానీ అలాంటి సంకేతాలే కనిపించకపోవడంతో పెళ్లికి రెడీ అయిపోయింది. పెళ్లయి కూడా ఏడాది పూర్తయింది. చేతిలో ఉన్న వేరే ప్రాజెక్టులు పూర్తి కావడం, ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోవడంతో కాజల్ బిడ్డను కనేందుకు రెడీ అయింది. ఆమె ప్రెగ్నెంట్ అయి కొన్ని నెలలు గడిచినట్లుగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కమల్ ‘విక్రమ్’ సినిమాను పూర్తి చేయగానే ఈ సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ టైంలో కాజల్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇంత భారీ ప్రాజెక్టు పున:ప్రారంభం అవుతుంటే కేవలం కాజల్ కోసం ఆగుతారా అన్నది డౌట్. ఆమెకు రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా కోసం కాజల్ పడ్డ కష్టమంతా వృథా అయినట్లే. తన పారితోషకం తనకొచ్చేయొచ్చు కానీ.. ఎంతో ఎగ్జైట్మెంట్తో చేసిన సినిమా నుంచి ఇలా తప్పుకోవాల్సి రావడం.. కమల్కు జోడీగా, శంకర్ దర్శకత్వంలో నటించిన సీన్లన్నింటినీ తీసి పక్కన పడేస్తుంటే ఎంత బాధ కలుగుతుందో చెప్పేదేముంది?
This post was last modified on November 12, 2021 7:09 am
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…