దక్షిణాది సినిమా స్థాయిని పెంచిన నటుల్లో ముందు కమల్ హాసన్ పేరు చెప్పుకోవాలి. ఇక దర్శకుల్లో అలాంటి ఒక స్థాయిని ఏర్పరుచుకున్న వాడు శంకర్. ఈ ఇద్దరితోనూ వేర్వేరుగా సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్ ఆశిస్తుంది. కానీ వీళ్లిద్దరితో ఒకేసారి సినిమా చేసే అరుదైన అవకాశం అందుకుంది కాజల్ అగర్వాల్. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అందులోనూ కెరీర్ చరమాంకంలో ఇలాంటి అవకాశం వచ్చినందుకు కాజల్ ఎంత సంబరపడిందో. కానీ ఆ సంబరం ఇప్పుడు నైరాశ్యంగా మారేలా కనిపిస్తోంది.
ఆమె కమల్ హాసన్-శంకర్ల కలయికలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయ్యాక వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా కోసం కాజల్ మీద చాలా సన్నివేశాలే తీశారు. కానీ క్రేన్ ప్రమాదం వల్ల దాదాపు రెండేళ్ల కిందట ఆగిన సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. ఇందుకు కారణాలు అనేకం.
తన డేట్లన్నీ వృథా అయినప్పటికీ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రతిష్ఠాత్మకం కావడంతో సినిమా ఎప్పుడు పున:ప్రారంభం అవుతుందా అని ఓపిగ్గా ఎదురు చూసింది కాజల్. కానీ అలాంటి సంకేతాలే కనిపించకపోవడంతో పెళ్లికి రెడీ అయిపోయింది. పెళ్లయి కూడా ఏడాది పూర్తయింది. చేతిలో ఉన్న వేరే ప్రాజెక్టులు పూర్తి కావడం, ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోవడంతో కాజల్ బిడ్డను కనేందుకు రెడీ అయింది. ఆమె ప్రెగ్నెంట్ అయి కొన్ని నెలలు గడిచినట్లుగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కమల్ ‘విక్రమ్’ సినిమాను పూర్తి చేయగానే ఈ సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ టైంలో కాజల్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇంత భారీ ప్రాజెక్టు పున:ప్రారంభం అవుతుంటే కేవలం కాజల్ కోసం ఆగుతారా అన్నది డౌట్. ఆమెకు రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా కోసం కాజల్ పడ్డ కష్టమంతా వృథా అయినట్లే. తన పారితోషకం తనకొచ్చేయొచ్చు కానీ.. ఎంతో ఎగ్జైట్మెంట్తో చేసిన సినిమా నుంచి ఇలా తప్పుకోవాల్సి రావడం.. కమల్కు జోడీగా, శంకర్ దర్శకత్వంలో నటించిన సీన్లన్నింటినీ తీసి పక్కన పడేస్తుంటే ఎంత బాధ కలుగుతుందో చెప్పేదేముంది?
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…