పుష్ప సినిమా నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసినపుడల్లా.. ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. అల్లు అర్జున్తో మొదలుపెడితే రష్మిక మందన్నా, ఫాహద్ ఫాజిల్, ధనంజయ, సునీల్, అనసూయ.. ఇలా ప్రతి క్యారెక్టర్ లుక్ కూడా స్టన్నింగ్గానే అనిపిస్తోంది. వీరిలో ఏ నటుడు కూడా మామూలుగా కనిపించేలా ఈ సినిమాలో లేడు. వారిని ఒక స్టన్నింగ్, సర్ప్రైజ్ లుక్లోకి మార్చి.. వారెవా ఇదేం మేకోవర్ అనిపిస్తున్నాడు సుకుమార్.
మొదట బన్నీ లుక్ చూసే జనాలు షాకైపోయారు. ఫాహద్, సునీల్, అనసూయల లుక్స్ కూడా అంతే స్టన్నింగ్గా అనిపించాయి. సినిమా మీద అంచనాలు పెరగడానికి ఒక రకంగా ఈ లుక్స్ కూడా కారణమే. కాకపోతే ఈ లుక్స్ చూసినపుడల్లా లోలోన కొంచెం భయం కూడా కలుగుతోంది మన ప్రేక్షకులకు.
బేసిగ్గా తెలుగు సినిమా అంటే గ్లామర్కు కేరాఫ్ అడ్రస్. హీరో ఎంత అట్టుడుగు వర్గానికి చెందిన వాడైనా కూడా అందంగానే కనిపించాలన్నట్లుగా ఉంటుంది మనోళ్ల ఆలోచన. మామూలుగా ఇలాంటి రా అండ్ రస్టిక్ లుక్స్.. క్యారెక్టర్స్ ఎక్కువగా తమిళ సినిమాల్లోనే చూస్తుంటాం. సహజత్వం పేరుతో నటీనటుల్ని జీర్ణించుకోలేని లుక్స్లో చూపిస్తుంటారు తమిళ ఫిలిం మేకర్స్. అలాంటివి చూసి ఒకప్పుడు మనోళ్లు ఎబ్బెట్టుగా ఫీలయ్యేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో మన దగ్గర కూడా ఇలాంటి రా అండ్ రస్టిక్ ఫీల్ ఉన్న సినిమాలు కొన్ని వచ్చాయి. ‘రంగస్థలం’ ఆ కోవలోనిదే. ఆ సినిమా తీసిన సుకుమారే ఇప్పుడు ‘పుష్ప’ తీస్తున్నాడు.
కాకపోతే ‘రంగస్థలం’ ఇరగాడేసింది కదా అని.. సుకుమార్ ఈ ‘రా అండ్ రస్టిక్’ ఫీల్ విషయంలో ఎక్స్ట్రీమ్కు వెళ్లిపోతున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదైనా సరే.. అతిగా చేస్తే జనాలకు ఎక్కదు. ‘రంగస్థలం’ ఆడింది కదా అని.. ‘పుష్ప’ పాత్రలు, వాటి లుక్స్ విషయంలో శ్రుతి మించి పోతే రేప్పొద్దున తెర మీద ఇంత ‘రానెస్’ను ‘డీగ్లామర్’ను తట్టుకోగలరో లేదో?
This post was last modified on November 10, 2021 6:18 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…