మాస్ కా దాస్ విశ్వక్సేన్ సినిమాల లైనప్ బానే ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘ఓ మై కడవులే’ రీమేక్ ఒకటి. తమిళంలో తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తుయే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్లో అశోక్ సెల్వన్, రితికా సింగ్ చేసిన పాత్రల్లో విశ్వక్, మిథిలా పార్కర్ నటిస్తున్నారు. ఈ రీమేక్కి ‘ఓరి దేవుడా’ అనే టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా తాజాగా విడుదల చేశారు. అప్పట్నుంచి కాస్త నెగిటివ్ కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఎంత రీమేక్ అయితే మాత్రం.. ఇంతలా దించేయాలా అనేదే ముఖ్యమైన కామెంట్. అక్కడ ఓ మై కడవులే అని పెట్టారు కదా అని తెలుగులో ఓరి దేవుడా అని పెట్టడం అంత రుచించడం లేదు. తరచుగా అందరూ వాడే మాటే అయినా టైటిల్గా ఇది అంత యాప్ట్గా అనిపించడం లేదు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మరీ దారుణం. తమిళ పోస్టర్ని మక్కీకి మక్కీ దించేశారు. దాంతో సినిమాని కూడా యాజిటీజ్ తీసేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.
వేరే భాషల్లో హిట్టయిన సినిమాలను తమ భాషలో రీమేక్ చేయడంలో తప్పేమీ లేదు. అయితే రీమేక్ అన్నారు కదా అని టైటిల్ దగ్గర్నుంచి ప్రతిదీ దించేస్తే వర్కవుట్ కాదని ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది. అందుకే రీమేక్ నుంచి ఫ్రీమేక్ స్టైల్కి వచ్చారు మేకర్స్. అక్కడ దబాంగ్ అంటే ఇక్కడ గబ్బర్ సింగ్ అన్నారు. అక్కడ లూసిఫర్ అంటే ఇక్కడ గాడ్ ఫాదర్ అంటున్నారు. ఇక్కడి నేటివిటీకి, యాక్టర్ల ఇమేజ్కి తగ్గట్టుగా టైటిల్ దగ్గర్నుంచి కాన్సెప్ట్ వరకు మార్పులు చేస్తేనే మన ఆడియెన్స్ కనెక్టవుతారు.
అలాంటిది విశ్వక్ సినిమాకి టైటిల్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టడం, కనీసం పోస్టర్లో కూడా సొంత క్రియేటివిటీ వాడకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పైగా ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నాడు. దిల్ రాజు, పీవీపీ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రేక్షకుల నాడి తెలిసిన ఇంతమంది కలిసి తీస్తున్న సినిమా కాబట్టి జనాలు కొత్తదనాన్ని ఆశించడంలో తప్పు లేదు కదా. కనీసం సినిమాలోనైనా అది కనిపిస్తుందేమో చూద్దాం.
This post was last modified on November 10, 2021 11:09 am
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…
ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…