Movie News

హీరో రాత మార్చిన బాడీ


టాలీవుడ్లో బెస్ట్ బాడీస్ ఉన్న హీరోల లిస్టు తీస్తే అందులో కార్తికేయ పేరు ముందు వరుసలో ఉంటుంది. బేసిగ్గానే అతడికి మంచి ఫిజిక్ ఉండగా.. బాగా కసరత్తులు చేసి దాన్నింకా మంచి షేప్‌లోకి తెచ్చుకున్నాడు. తాను హీరోగా ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నానంటే.. తనకిన్ని అవకాశాలు వచ్చాయంటే అందుకు బాడీ ఓ ముఖ్య కారణం అంటున్నాడు కార్తికేయ.

తన కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా అవకాశం కూడా తన బాడీ చూసే వచ్చిందని.. ఇంకో రెండు పెద్ద అవకాశాలకు కూడా బాడీనే కారణమైందని స్వయంగా కార్తికేయనే వెల్లడించడం విశేషం. తన కొత్త చిత్రం ‘కార్తికేయ’ ప్రమోషన్లలో భాగంగా మీడియా ఇంటర్వ్యూల్లో అతనీ విషయం పంచుకున్నాడు.

“నా బాడీ, ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతి నన్ను ఆ సినిమా కోసం అడిగినపుడు.. ‘సార్ నేను మీకు ఎలా తెలుసు నేను యాక్టింగ్ చేస్తానని’ అని అడిగాను. అందుకాయన బదులిస్తూ.. ‘అదంతా నాకు తెలియదు. నీకు బాడీ ఉందని తీసుకున్నాను. యాక్టింగ్ చేయించుకుందాం అనుకున్నాను. అంతే’ అన్నాడు. తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడు విక్రమ్ కుమార్ గారిని కూడా నన్నెందుకు తీసుకున్నారని అడిగాను. ఆయన కూడా నీకు మంచి బాడీ ఉందనే ఎంచుకున్నా అన్నారు.

ఇప్పుడు అజిత్ గారితో చేస్తున్న ‘వలిమై’ సినిమాలో ఛాన్స్ రావడానికి కూడా నా బాడీనే కారణం. ఐతే బాడీ ఉందని తీసుకున్న ముగ్గురు దర్శకులూ కూడా తర్వత నా నటనను చూసినపుడు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు చేసినపుడు నటనలోని ఇంటెన్సిటీ చూసి సర్ప్రైజ్ అయ్యామన్నారు. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి. ఐతే బాడీ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఇంతమంది నమ్మి అవకాశాలు ఇస్తున్నపుడు పర్లేదు. కష్టపడొచ్చు అనుకుంటాను” అని కార్తికేయ అన్నాడు.

This post was last modified on November 9, 2021 8:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago