టాలీవుడ్లో బెస్ట్ బాడీస్ ఉన్న హీరోల లిస్టు తీస్తే అందులో కార్తికేయ పేరు ముందు వరుసలో ఉంటుంది. బేసిగ్గానే అతడికి మంచి ఫిజిక్ ఉండగా.. బాగా కసరత్తులు చేసి దాన్నింకా మంచి షేప్లోకి తెచ్చుకున్నాడు. తాను హీరోగా ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నానంటే.. తనకిన్ని అవకాశాలు వచ్చాయంటే అందుకు బాడీ ఓ ముఖ్య కారణం అంటున్నాడు కార్తికేయ.
తన కెరీర్ను గొప్ప మలుపు తిప్పిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా అవకాశం కూడా తన బాడీ చూసే వచ్చిందని.. ఇంకో రెండు పెద్ద అవకాశాలకు కూడా బాడీనే కారణమైందని స్వయంగా కార్తికేయనే వెల్లడించడం విశేషం. తన కొత్త చిత్రం ‘కార్తికేయ’ ప్రమోషన్లలో భాగంగా మీడియా ఇంటర్వ్యూల్లో అతనీ విషయం పంచుకున్నాడు.
“నా బాడీ, ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతి నన్ను ఆ సినిమా కోసం అడిగినపుడు.. ‘సార్ నేను మీకు ఎలా తెలుసు నేను యాక్టింగ్ చేస్తానని’ అని అడిగాను. అందుకాయన బదులిస్తూ.. ‘అదంతా నాకు తెలియదు. నీకు బాడీ ఉందని తీసుకున్నాను. యాక్టింగ్ చేయించుకుందాం అనుకున్నాను. అంతే’ అన్నాడు. తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడు విక్రమ్ కుమార్ గారిని కూడా నన్నెందుకు తీసుకున్నారని అడిగాను. ఆయన కూడా నీకు మంచి బాడీ ఉందనే ఎంచుకున్నా అన్నారు.
ఇప్పుడు అజిత్ గారితో చేస్తున్న ‘వలిమై’ సినిమాలో ఛాన్స్ రావడానికి కూడా నా బాడీనే కారణం. ఐతే బాడీ ఉందని తీసుకున్న ముగ్గురు దర్శకులూ కూడా తర్వత నా నటనను చూసినపుడు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు చేసినపుడు నటనలోని ఇంటెన్సిటీ చూసి సర్ప్రైజ్ అయ్యామన్నారు. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి. ఐతే బాడీ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఇంతమంది నమ్మి అవకాశాలు ఇస్తున్నపుడు పర్లేదు. కష్టపడొచ్చు అనుకుంటాను” అని కార్తికేయ అన్నాడు.
This post was last modified on November 9, 2021 8:16 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…