నాటు నాటు అంటూ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొత్త పాట రాబోతోంది. ఈ పాటకు సంబంధించి చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ పాట లిరిక్స్ కానీ.. అందులో హీరోల డ్రెస్సింగ్ కానీ.. వాళ్ల బాడీ లాంగ్వేజ్, స్టెప్పులు కానీ.. దాన్ని చిత్రీకరించిన తీరు కానీ.. 1920 స్టయిల్లో ఎంతమాత్రం లేవు. ఈ కథ వందేళ్ల వెనుకటి నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ చేస్తున్నది అల్లూరి సీతారామరాజు పాత్ర అయితే.. తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
వాస్తవంగా ఎప్పుడూ కలవని, వేర్వేరు కాలాలకు చెందిన వీళ్లిద్దరూ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా కలిసి నడిస్తే ఎలా ఉంటుందనే ఊహే ‘ఆర్ఆర్ఆర్’. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోలు చూస్తే పాత-కొత్తల కలయికల్లాగా కనిపించాయి.
ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న ‘నాటు నాటు’ పాట చూసినా పాత స్టయిల్లో లేదు. అందులో ఆధునికత కనిపిస్తోంది. ఈ పాట ఈ పీరియడ్ డ్రామాలో ఎలా సెట్టవుతుందో అర్థం కావడం లేదు. ఆ కాలంలో ఈ తరహాలో పాట ఉంటే మాత్రం అది ఎంతమాత్రం నప్పదు. దాని వల్ల సినిమా చెడిపోవచ్చు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోల్లో కూడా అక్కడక్కడా ఆధునిక ఛాయలు కనిపించాయి. కాబట్టి ఈ కథను ఈ కాలంలో మొదలుపెట్టి.. పునర్జన్మల కాన్సెప్ట్తోనో.. లేదంటే ఫ్లాష్ బ్యాక్ రూపంలోనో.. వెనుకటి కాలంలోకి తీసుకెళ్లే అవకాశముంది. లేదంటే ‘నాటు నాటు’ సినిమాలో లేకుండా కేవలం ప్రమోషనల్ సాంగ్ లాగా మాత్రమే ఉంటే ఉండొచ్చు. ఈ సస్పెన్సుకు ట్రైలర్ రిలీజయ్యే వరకు తెరపడే అవకాశం లేదు. ట్రైలర్లో కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళికి అలవాటు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో నెలకొన్న సందేహాలకు ట్రైలర్తో తెరపడుతుందేమో చూడాలి మరి.
This post was last modified on November 9, 2021 8:04 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…