జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా మీద కొన్నేళ్ల నుంచి గందరగోళం నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ అతడి 29వ చిత్రం కాగా.. 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో చేయాల్సిన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లో, మరో కారణంతోనో ఉన్నట్లుండి రద్దయిపోయింది. దాదాపు ఏడాది చర్చల తర్వాత ఈ సినిమా ఆగిపోవడం అభిమానులను నిరాశ పరిచింది. ఐతే దాని స్థానంలో వెంటనే కొరటాల శివ చిత్రాన్ని ప్రకటించి అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం తీసుకొచ్చాడు తారక్.
కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్తో కలిసి తారక్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఐతే ఈ సినిమాను ప్రకటించాక కూడా రకరకాల కారణాల వల్ల ఇది పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగింది. చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకపోవడంతో అభిమానుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.
ఐతే ఇటు తారక్, అటు కొరటాల తమ కమిట్మెంట్లను ముగించుకుని.. ఫిబ్రవరిలో ఈ సినిమాను మొదలుపెట్టాలని ఫిక్సయినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి తారక్ షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసినప్పటికీ.. ప్రమోషన్ల కోసం టైం కేటాయించాల్సి ఉంది. మధ్యలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం కొంత సమయం కేటాయించాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు మొదలయ్యే వరకు తారక్ విశ్రాంతికి పరిమితం కానున్నాడు. ఇటీవలి చేతి గాయం వల్ల కూడా తారక్ ఇంకే షూట్స్ పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మరోవైపు కొరటాల.. తారక్ సినిమా స్క్రిప్టు రెడీ చేస్తూనే ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. చిరుతో ఆయన సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పని మొత్తం ముగిశాక టెన్షన్ లేకుండా తారక్ సినిమాను మొదలుపెట్టాలని కొరటాల ఫిక్సయ్యాడు. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ తాలూకు బడలిక అంతా తీర్చుకుని తాజాగా ఉంటాడు తారక్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చడం ఖాయమైనట్లే.
This post was last modified on November 9, 2021 7:55 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…