థియేటర్లలో వచ్చినా.. ఓటీటీలో రిలీజ్ చేసినా.. ఈ రోజుల్లో ఓ సినిమాకు ప్రమోషన్ చాలా చాలా అవసరం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో.. అలాగే సోషల్ మీడియాలో.. ఇంకా బయట ప్రమోషనల్ ఈవెంట్ల ద్వారా కోట్లు ఖర్చు పెట్టి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓటీటీ సినిమాలను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుండటం గమనించవచ్చు. ఇలాంటి సమయంలో ఓ కొత్త సినిమాను దాని మేకర్స్ పెద్దగా ప్రమోట్ చేయాల్సిన అవసరమే పడట్లేదు. నిజాయితీగా ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
సినిమా చూసి కదిలిపోయిన ఆడియన్స్.. దాన్ని నెత్తిన పెట్టుకుని తామే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరు పది మందికి చెప్పి ఆ సినిమా చూపిస్తున్నారు. ఆ చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కేలా చూస్తున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా సూర్య సినిమా ‘జై భీమ్’ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.
నవంబరు 2న ఓ మోస్తరు అంచనాలతో విడుదలైంది ‘జై భీమ్’. ఈ టైటిల్, దీని ప్రోమోలు చూసి మరీ సీరియస్, ట్రాజిక్ మూవీలా ఉందనుకుని చాలామంది దీనికి దూరంగా ఉన్నారు. కానీ సీరియస్ ఇష్యూనే చాలా హృద్యంగా, ఎంతో ఆసక్తికరంగా చెప్పడం.. చూసిన ప్రతి ప్రేక్షకుడినీ ఈ సినిమా కదిలించేయడం.. ఆలోచనలో పడేయడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువమందికి చూపించాలనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది. మౌత్ పబ్లిసిటీ బాగా ఉపయోగపడి అమేజాన్లో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంకా వివిధ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా ఎవరి స్థాయిలో వారు ఈ సినిమాపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్కరి స్పందన గొప్పగా ఉండటంతో కచ్చితంగా ఈ సినిమా చూడాలనే భావన అందరిలోనూ కలుగుతోంది. మొత్తంగా దీపావళికి థియేటర్లలో రిలీజైన వేరే సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి ‘జై భీమ్’యే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఇదే సామాజిక మాధ్యమాల్లో అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…