థియేటర్లలో వచ్చినా.. ఓటీటీలో రిలీజ్ చేసినా.. ఈ రోజుల్లో ఓ సినిమాకు ప్రమోషన్ చాలా చాలా అవసరం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో.. అలాగే సోషల్ మీడియాలో.. ఇంకా బయట ప్రమోషనల్ ఈవెంట్ల ద్వారా కోట్లు ఖర్చు పెట్టి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓటీటీ సినిమాలను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుండటం గమనించవచ్చు. ఇలాంటి సమయంలో ఓ కొత్త సినిమాను దాని మేకర్స్ పెద్దగా ప్రమోట్ చేయాల్సిన అవసరమే పడట్లేదు. నిజాయితీగా ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
సినిమా చూసి కదిలిపోయిన ఆడియన్స్.. దాన్ని నెత్తిన పెట్టుకుని తామే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరు పది మందికి చెప్పి ఆ సినిమా చూపిస్తున్నారు. ఆ చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కేలా చూస్తున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా సూర్య సినిమా ‘జై భీమ్’ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.
నవంబరు 2న ఓ మోస్తరు అంచనాలతో విడుదలైంది ‘జై భీమ్’. ఈ టైటిల్, దీని ప్రోమోలు చూసి మరీ సీరియస్, ట్రాజిక్ మూవీలా ఉందనుకుని చాలామంది దీనికి దూరంగా ఉన్నారు. కానీ సీరియస్ ఇష్యూనే చాలా హృద్యంగా, ఎంతో ఆసక్తికరంగా చెప్పడం.. చూసిన ప్రతి ప్రేక్షకుడినీ ఈ సినిమా కదిలించేయడం.. ఆలోచనలో పడేయడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువమందికి చూపించాలనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది. మౌత్ పబ్లిసిటీ బాగా ఉపయోగపడి అమేజాన్లో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంకా వివిధ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా ఎవరి స్థాయిలో వారు ఈ సినిమాపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్కరి స్పందన గొప్పగా ఉండటంతో కచ్చితంగా ఈ సినిమా చూడాలనే భావన అందరిలోనూ కలుగుతోంది. మొత్తంగా దీపావళికి థియేటర్లలో రిలీజైన వేరే సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి ‘జై భీమ్’యే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఇదే సామాజిక మాధ్యమాల్లో అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…