టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమె ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా బరువు పెరిగింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనుష్క పెట్టిన ఎఫర్ట్స్ ను ప్రేక్షకులు ప్రశంసించారు. అప్పటినుంచి తన శరీర బరువుని తగ్గించుకునే పనిలో పడింది. పర్సనల్ ట్రైనర్ సహాయంతో బరువు తగ్గి మునుపటి అనుష్కలా మారింది. ఇప్పుడు హెల్తీ షేప్ లోనే ఉంది ఈ బ్యూటీ. దీంతో దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తరువాత అనుష్క తన వ్యక్తిగత జీవితంలో కాస్త బిజీ అవ్వడంతో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని సమాచారం.
రీసెంట్ గానే అనుష్క ఫైనల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘రారా కృష్ణయ్య’ సినిమాను రూపొందించిన దర్శకుడు మహేష్ పి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత అనుష్క చేయబోయే సినిమా ఇదే. రేపు అనుష్క పుట్టినరోజు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూద్దాం!
This post was last modified on November 8, 2021 9:59 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…