Movie News

మెగాహీరోతో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ!

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడని కూడా టాక్ వచ్చింది. ఫైనల్ గా దసరా సమయంలో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటినుంచి తేజుని కలవడానికి చాలా మంది ఇండస్ట్రీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ తేజుకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. తాజాగా దీపావళి పండగ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటో చూసిన అభిమానులంతా ఖుషీ అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే.. కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటారట. జనవరి నెల నుంచి ఈ మెగాహీరో సెట్స్ పైకి వెళ్లనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై, సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రానా భార్య పాత్రలో ఆమె కనిపించనుంది. కథ ప్రకారం.. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on November 7, 2021 3:31 am

Share
Show comments
Published by
suman

Recent Posts

అకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలి

పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…

1 hour ago

ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…

2 hours ago

షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాజ్య‌స‌భ‌కు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 2024…

3 hours ago

స్పిరిట్ మీద ఇన్ని పుకార్లు ఎందుకు

టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా…

3 hours ago

మంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై…

4 hours ago

గవర్నర్ దగ్గరకు సింగరేణి పంచాయతీ

సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే నైనీ కోల్ బ్లాక్ కోసం…

5 hours ago