Movie News

మెగాహీరోతో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ!

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడని కూడా టాక్ వచ్చింది. ఫైనల్ గా దసరా సమయంలో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటినుంచి తేజుని కలవడానికి చాలా మంది ఇండస్ట్రీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ తేజుకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. తాజాగా దీపావళి పండగ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటో చూసిన అభిమానులంతా ఖుషీ అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే.. కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటారట. జనవరి నెల నుంచి ఈ మెగాహీరో సెట్స్ పైకి వెళ్లనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై, సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రానా భార్య పాత్రలో ఆమె కనిపించనుంది. కథ ప్రకారం.. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on November 7, 2021 3:31 am

Share
Show comments
Published by
suman

Recent Posts

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…

2 hours ago

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. స్టాలిన్ కు కష్టమే

దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…

3 hours ago

కూట‌మికి నేటితో ప‌ది నెల‌లు.. ఏం సాధించారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి శుక్ర‌వారంతో 10 మాసాలు గ‌డిచాయి. గ‌త ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి స‌ర్కారుకొలువు…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బహుమతిగా రూ.4 కోట్లు ఇచ్చిన బీజేపీ

హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…

4 hours ago

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…

4 hours ago

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…

5 hours ago