మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడని కూడా టాక్ వచ్చింది. ఫైనల్ గా దసరా సమయంలో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటినుంచి తేజుని కలవడానికి చాలా మంది ఇండస్ట్రీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ తేజుకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. తాజాగా దీపావళి పండగ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటో చూసిన అభిమానులంతా ఖుషీ అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే.. కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటారట. జనవరి నెల నుంచి ఈ మెగాహీరో సెట్స్ పైకి వెళ్లనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై, సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రానా భార్య పాత్రలో ఆమె కనిపించనుంది. కథ ప్రకారం.. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…